Home » Fire Accident
రాజస్థాన్లోని బలోత్రా జిల్లా పచ్పద్రలోని ఆయిల్ రిఫైనరీని మంగళవారంనాడు తన చేతుల మీదుగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉండగా ఆ కార్యక్రమం తాజాగా వాయిదా పడింది. పచ్పద్రలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ వద్ద సోమవారంనాడు అగ్నిప్రమాదం జరిగింది.
విశాఖపట్నంలోని గాజువాకలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పచ్పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు రిఫైనరీ దగ్గరకు చేరుకున్నాయి. మంటలను ఆర్పటం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
హైదరాబాద్లో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
అగ్నిప్రమాదాలు, వాటి నివారణ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కంబాలపల్లె గ్రామ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైంది.
తమిళనాడు విరుద్నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాత్తూర్లోని బాణసంచా కేంద్రంలో మంటలు చెలరేగాయి. మందుగుండు సామగ్రి పేలడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లాలో ఎండలు ముదురుతున్న వేళ ఊహించని అగ్నిప్రమాదాలు రైతన్నల కడుపు కొడుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం స్థానిక రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.
సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుళ్లతో రెండు వేర్వేరు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, ఇళ్లకు భారీ నష్టం వాటిల్లింది.
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్తో పాటు టోలీచౌకిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.