Home » Fire Accident
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 తాటాకు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 13 కుటుంబాలు వారు నిరాశ్రయులయ్యాయి.
హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో ఉన్న హీరో షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు షోరూం అంతటా వ్యాపించడంతో సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించగా, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నాంపల్లి ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై వివాదం రాజుకొంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లోని విలువైన డేటా అంతా అగ్నిప్రమాదంలో ధ్వంసమైందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కార్యాలయంలోని కీలక డేటా మొత్తం కాలిపోయిందని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే..
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుందని ప్రయాణికులు తెలిపారు..
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో గల ఓ ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కోల్కతా నగరంలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో జనవరి 26న అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది..
భూపాలపల్లి జిల్లా సింగరేణి గనుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గనికి సంబంధించిన ల్యాంప్రూమ్లో మంటలు వ్యాపించాయి. గనిలో పనిచేసే కార్మికులకు సంబంధించిన 1500 ల్యాంప్లు మంటల్లో కాలిపోయాయి.
నాంపల్లి ప్రాంతంలోని ఫర్నిచర్ గోదాంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.