Home » Farmers
కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే దేశవ్యాప్తంగా యూరియా కొరత నెలకొందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఎరువుల ఉత్పత్తిని పెంచకపోవటం వల్ల సమస్య పెరిగిపోయిందన్నారు.
ఉద్యాన పంటలకు మద్దతు ధరపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలకుండా కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రైతులు బారులు తీరి పడిగాపులు పడుతున్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఒక దశలో తోపులాట జరిగింది.
రైతులకు యూరియా కష్టాలు తీరేదెన్నడో గానీ తెల్లవారగానే క్యూలైన్లలో నిల్చోవడం వారికి తప్పడం లేదు. గంటల తరబడి నిరీక్షించినా సరిపడా బస్తాలు దొరక్కపోవడంతో నిరాశా తప్పడం లేదు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు సాగు చేయగా.. అవి ఇంకా నిలదొక్కుకోకముందే వానలు, వరదలకు కొట్టుకుపోతున్నాయి.
యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండ్రోజుల్లో రాష్ట్రానికి 21,325 టన్నుల యూరియా వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఏపీ రైతులకు శుభవార్త. రాష్ట్రానికి తక్షణ అవసరాల నిమిత్తం 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఏపీ రైతులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పండుగ లాంటి వార్త తెలిపారు. ఎరువుల అవసరాలపై కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడానని పేర్కొన్నారు.
ఎరువుల లభ్యత, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆరా తీశారు.
రాష్ట్రంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అరకొరగా వస్తున్న యూరియాను అధికారులు టోకెన్లు జారీ చేసి.. పోలీసుల బందోబస్తు మధ్య పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.