Home » Enforcement Directorate
గత కొంతకాలంగా ఈడీ కళ్లుగప్పి తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ను ఎట్టకేలకు అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా నోట్ల కట్టలతో నిండిన సంచులు దొరికినట్లు తెలుస్తోంది. వెస్ట్రన్ టవర్స్లోని ఓ ఫ్లాట్లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం.
ఈ ఏడాది ప్రారంభంలో కోల్కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు మధ్యలోకి ముఖ్యమంత్రి చొరబడి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టటం సరికాదని వ్యాఖ్యానించింది.
కోల్కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంపై ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపిన సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది హర్షించదగిన పరిణామం కాదని పేర్కొంది.
ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ అనంతరం బయటకు వచ్చిన మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్ మైక్ను చూసి పరుగులు పెట్టారు. ఏబీఎన్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కృష్ణమోహన్ రెడ్డి నీళ్లు నమిలారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలోని ఆయన విలాసవంతమైన నివాసం 'అబోడ్' ను తాత్కాలికంగా జప్తు చేసింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. సోరెన్పై మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన క్రిమినల్ ప్రొసీడింగ్స్పై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.
ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఉన్న రూ.40 వేల కోట్ల మోసం కేసుల్లో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. వందలాది కోట్ల రూపాయలు చేతులు మారడంపై ఈడీ విచారణ చేపట్టనుంది..