Home » Elections
బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమైంది. ఇవాళ తొలి దశ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని జేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. పావలా వడ్డీకి కేంద్రం నిధులు ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్లకు అభివృద్ధి పనులు చేయడానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది.
మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవలం 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్కడి ప్రజలు హస్తం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే.. కొన్ని సర్వే సంస్థలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ముందే తీర్పు ఇచ్చాయి. ఇప్పుడు అందరికీ ఉన్న సందేహం ఏంటంటే.. ఈ సర్వేలను నమ్మచ్చా?.. అని.. ఇంతకీ ఈ ఉపఎన్నికపై ఏ సర్వే సంస్థ ఏం అంచనా వేసిందో చూద్దాం.
బీజేపీ నేతల్లారా సిద్ధంగా ఉండండి.. ఆటంబాంబు తర్వాత హైడ్రోజన్ బాంబు రాబోతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశం అయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అవ్వా , తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా? అంటూ నిలదీశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్)తో కూడిన 'మహా వికాస్ అఘాడి'లో అంతర్గత విభేదాలున్నాయని, దీనిని అవకాశంగా మలుచుకుని ఎంవీఏకు సంప్రదాయంగా పట్టున్న ప్రాంతాల్లో పాగా వేయాలని బీజేపీ ఆలోచనగా ఉంది.