Home » Election Commission
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తదుపరి చర్యలు, రిజర్వేషన్ల అంశంపై వివరణను ఆ లేఖలో కోరింది. ఇటీవలి కోర్టు తీర్పు నేపథ్యంలో..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థులు పెట్టే ఖర్చులకు సంబంధించిన ధరల పట్టికను ఎన్నికల అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అభ్యర్థులు రోజువారీగా ఖర్చులను చూపించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రజలకు కీలక సూచన చేశారు.
2020లో అసెంబ్లీ ఎన్నికలు బిహార్ వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగాయి. మొత్తం 243 స్థానాలకు గాను నవంబర్ 22 వరకు ఎన్నికలు జరిగాయి.
ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా గతంలో 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉండగా, ఇప్పుడు దానిని 1,200 ఓటర్లకు ఒక బూత్గా నిర్ణయించామని సీఈసీ చెప్పారు. దీంతో అదనంగా 12,817 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎలక్షన్ కమిషన్ టీమ్ మొత్తం రెండ్రోజులుగా బిహార్లోనే ఉందని, రాష్ట్ర పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధిపతులు, నోడల్ అధికారులతో సమావేశాలను నిర్వహించామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.
బిహార్ రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని తాము కోరినట్టు జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా తెలిపారు. బిహార్లో శాంతిభద్రతల సమస్య కానీ, నక్సల్స్ సమస్య కానీ లేవనీ, మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించిన తరహాలోనే బిహార్లోనూ ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో కోరామన్నారు.
బిహార్ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లు ప్రభావితం చేసే అవకాశాలు మెండు. ప్రధాన పార్టీలు, కూటములు ప్రధానంగా మహిళా ఓటర్లను కీలకంగా భావిస్తూ ప్రచారం సాగిస్తుంటాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను మంగళవారం ప్రకటించారు. మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారని పేర్కొన్నారు. సెప్టెంబరు 17 రాత్రి వరకు కొత్తగా ఓటు నమోదుకు 6,563 దరఖాస్తులు, తొలగింపు కోసం 361, సవరణ కోసం 2,298 దరఖాస్తులు వచ్చాయి.
ముసాయిదా జాబితాకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను ఈనెల 30న ఈసీ ప్రకటించింది. ఇందులో అదనంగా 3.66 లక్షల అనర్హులైన ఓటర్లను తొలగించగా, 21.53 లక్షల అర్హులైన ఓటర్లను జాబితాలోకి చేరింది.