Share News

Election Commission: సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక

ABN , Publish Date - Aug 08 , 2025 | 05:46 AM

ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబరు 9న ఎన్నికలు నిర్వహిస్తామని.. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది.

Election Commission: సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబరు 9న ఎన్నికలు నిర్వహిస్తామని.. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది. నామినేషన్లను గురువారం నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 21 వరకు నామినే షన్ల దాఖలుకు చివరి తేదీ అని, 22న వాటిని పరిశీలిస్తామని పేర్కొంది. ఈనెల 25 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని వివరించింది.


ఆరోగ్య కారణాలతో జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి పదవికి జూలై 21న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్డీయే కూటమి గురువారం సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి కూటమి నేతలంతా హాజరై ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, ఎన్నికల సమన్వయంపై చర్చించారు.

Updated Date - Aug 08 , 2025 | 05:46 AM