Home » Election Commission
భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ అన్నారు. అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషనర్ ఎలా వివక్ష చూపిస్తుందని ప్రశ్నించారు.
బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్కు వ్యతిరేకంగా 'ఓటర్ అధికార్ యాత్ర'ను రాహల్ గాంధీ ప్రకటించారు. ఈ ప్రచారంలో పాల్గొనాలని ప్రజలను ఆయన కోరారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా బీహార్ గడ్డపై నుంచే ఆగస్టు 17 నుంచి 'ఓటర్ అధికార్ యాత్ర'ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్ జగన్ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఆదేశించారు. మంగళవారం రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు బుధవారం కలిశారు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ను మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విద్య మౌలిక వసతుల కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టే అధికారం ఈసీఐకి ఉందా అనే ప్రాథమిక అంశాన్ని నిర్ణయించాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అలాంటి అధికారం లేనట్టయితే ఈ అంశం ఇక్కడితో ముగుస్తుందని, ఆ అధికారం ఈసీఐకి ఉన్నట్లయితే ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఇందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. మంగళవారంనాడు పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఒకటి రెండు సీట్లలో కాకుండా చాలా సీట్లలో ఓట్ల చోరీ జరుగుతోందని, ఇది ఒక క్రమపద్ధతిలో జాతీయ స్థాయిలో జరుగుతోందని అన్నారు.
మ్మడి కడప జిల్లాలోని రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆదివారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడంతో అంతా గప్చుప్గా మారింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్రెడ్డి బరిలో ఉన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబరు 9న ఎన్నికలు నిర్వహిస్తామని.. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది.
బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జీఓ గతంలో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితా అనంతరం మరోసారి కోర్టును అశ్రయించింది.