Home » DMK
తమిళ భాషలో మెడికల్ కోర్సులు ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని తాను కోరుతున్నాననీ, ఇందువల్ల పేద కుటుంబాల పిల్లలు సైతం వైద్యులు కావాలనే తమ కలలను పండించుకుంటారని మోదీ అన్నారు.
అన్నాడీఎంకే నేతలపై రాష్ట్ర ఉమ ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చానీయాంశమైంది.
కేంద్రప్రభుత్వం పదివేల కోట్లిచ్చినా రాష్ట్రంలో త్రిభాషా విద్యావిధానాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ప్రముఖ హీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాయమాటలతో మోసం చేయొద్దంటూ ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం తమ మనుగడను సాధించిన దాఖలాలు లేవని ఆయన హెచ్చరించారు.
Minister Satyakumar: డీఎంకే పార్టీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో ఎన్నికలు ఉన్నందునే డీలిమిటేషన్ను డీఎంకే పార్టీ తెరమీదకు తెచ్చిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.
నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో డీఎంకే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన హాజరు కాలేదు.
Janasena party: తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో డీలిమిటేషన్పై ఇవాళ సమావేశం జరిగింది. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనాలని జనసేనకు కూడా ఆహ్వానం పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమాచార సాధానాలకు చేతినిండా పని కల్పిస్తున్నారు. అలాగే మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల సమరం కూడా జరగనుండడంతో అన్ని పార్టీలు సిద్దమతున్నాయి. దీంతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.
ఒక్క నోటిమాట ఆయన పదవికే ఎసరు తెచ్చింది. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు ఊరికే చెప్పలేదు కాబోలు. పార్టీ పదవిని చేపట్టిన 24 రోజుల్లోనే డీఎంకే ధర్మపురి తూర్పు జిల్లా కార్యదర్శి పి.ధర్మసెల్వన్ను ఆ పదవి నుండి పార్టీ అధిష్టానం తొలగించింది.
టాస్మాక్ అవినీతిని ఖండిస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని ముట్టడించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టాస్మాక్ సంస్థలో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.