Home » DMK
రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన బూత్కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘ఉంగలుడన్ స్టాలిన్’ పేరుతో ప్రారంభమైన ప్రజావిజ్ఞప్తుల శిబిరాలకు వస్తున్న జనాలను చూసి ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామికి వణకుపుట్టి, విమర్శల పేరుతో డీఎంకే ద్రావిడ తరహా పాలనకు విస్తృత ప్రచారం చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎద్దేవా చేశారు.
జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా అన్నాడీఎంకేపై తిరుగుబాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి
తమ హైకమాండ్ అనుమతి లేకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ సీట్లు కోరలేమని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై(TNCC President Selvaperunthagai) అన్నారు.
రాష్ట్రంలో రౌడీయిజం, దౌర్జన్యం, హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా జగుతోందని, ‘కమీషన్, కరప్షన్ నిర్విఘ్నంగా సాగుతోందని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు.
మతవాద బీజేపీ గొంతుకగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ధ్వజమెత్తారు.
హిందీని బలవంతంగా రుద్దడంపై రెండు దశాబ్దాలుగా కేంద్రతో విభేదిస్తున్న స్టాలిన్ శనివారంనాడు ఒక ట్వీట్లో ఉద్ధవ్, రాజ్ ఒకే వేదికపై కలుసుకోవడం, విజయోత్సవం జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సోదరులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన 12వేల మందితో కూడిన యువజన విభాగం డీఎంకే సైన్యంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పేర్కొన్నారు..
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వ పాలన చూసి ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మెచ్చుకుంటున్నారని, గతంలో లేని విధంగా మూడువేలకు పైగా సుప్రసిద్ధ ఆలయాలకు మహాకుంభాభిషేకాలను జరిపించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
ట్రెండ్ మారిన ‘తమిళనాడు ఇన్ యూనిట్’ అనే ప్రచారం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకోనున్నట్లు డీఎంకే ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్ తెలిపారు.