Home » DMK
లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే త్రిభాషా విధానంపై స్టాలిన్ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. కాగా, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీఎంకే కొట్టివేసింది.
ప్రముఖ సినీనటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. శుక్రవారం చెన్నైలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా.. ప్రస్తుత రాజకీయాలు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్ర ఎంకే స్టాలిన్ మరోసారి మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యావిధానం ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేది కాదని, అది పూర్తిగా కాషాయ విద్యావిధానమంటూ.. అందుకే దానిని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే ప్రసక్తే లేదని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. కొత్తగా పెళ్ళిచేసుకునే దంపతులు వెంటేనే పిల్లల్ని కనండి, కానీ ఎక్కవ మందిని కనొద్దటూ.. పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రంలో బీజేపీ నాయకులు పసలేని విమర్శలు చేస్తున్నారని కూడా ఉదయనిధి అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు ఇస్తూ, ఎన్ఈపీపై డీఎంకే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్కు నిధులను ఎన్ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ (డీఎంకే) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.
బడ్జెట్ సమావేశాల సెకెండ్ సెషన్ సోమవారంనాడు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ డీఎంకే వైఖరిపై విరుచుకుపడటంతో పార్లమెంటులో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. డీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో 30 నిమిషాల పాటు సభ వాయిదా పడింది.
క్సభ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), జాతీయ విద్యావిధానంపేరుతో రాష్ట్రంలో హిందీని నిర్బంధంగా అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలపై కేంద్రంతో...
పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ అంశం చాలా కీలమైందని పేర్కొంటూ మూడు తీర్మానాలను డీఎంకే ఎంపీల సమావేశంలో ఆమోదించారు. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి స్టాలిన్కు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానాన్నిఆమోదించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. భాష గురించి అడిగితే ఈడీతో దాడులు చేయిస్తారా.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక త్రిభాషా విధానంపై తాము నిలదీస్తున్నందుకే ఈడీతో దాడులు చేయిస్తున్నారని ఉదయనిధి వ్యాఖ్యానించారు.
దేశంలో తాజా జనాభా లెక్కల ప్రకారం ఎంపీల సంఖ్య పెంచి, వారిని అలంకార బొమ్మలుగా కూర్చొబెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రశ్నించారు.