Home » DK Shivakumar
తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. టీవీకేకు మద్దతు ప్రకటించిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్ట్కు తరలించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారంనాడు తోసిపుచ్చారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీ ట్రబుల్ షూటర్గా పేరున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను రంగంలోకి దింపింది.
నాయకత్వ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కట్టుబడి ఉంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకుఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల ద్వారా మాత్రమే ప్రగతి సాధిస్తుందని, ఏ ఒక్క వ్యక్తితోనో ముందుకు వెళ్లదని, అది సీఎం సిద్దరామయ్య అయినా మంత్రి జమీర్ అయినా ఒక్కటేనని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు.
డీకే శివ కుమార్తో తనది పాలు, తేనె సంబంధం అని తమ నెవరూ విడదీయలేరని సీఎం సిద్దరామయ్య అన్నారు.
ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటుచేసుకోనుందంటూ వస్తున్న ఊహాగానాలు తగ్గుముఖం పట్టడం లేదు. కర్ణాటక వార్షిక బడ్జెట్ కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గైర్హాజరు కావడం, ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో మరోసారి ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి
కర్ణాటకలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదంటూ ఎమ్మెల్సీ యంత్రీంద సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారంనాడు స్పందించారు. ఆయనే (యతీంద్ర) మా అధిష్టానం అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ తమ్ముడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదు.. తలరాత రాసి ఉంటే మా అన్న సీఎం అవుతారు.. అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.
పార్టీ పట్ల మొదటి నుంచీ క్రమశిక్షణ కలిగిన సైనికుడు గానే తన సోదరుడు ఉన్నారని డీకే శివకుమార్ అభివర్ణించారు. ఇటు పార్టీ ప్రయోజనాలు, అటు శాసనసభ్యుల ప్రయోజనాలకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారని చెప్పారు..