Home » Diwali
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శనివారం ( ఈ నెల18న) దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి.
దీపావళి పండుగ(Diwali festival) కోసం తమ సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు సోమవారం రాత్రి నుంచి చెన్నైకి తిరుముఖం పట్టారు.
లండన్లోని ఓ భారతీయ కుటంబం (Indian origin Family) లో దీపావళి వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. పశ్చిమ లండన్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆదివారం భార్య క్యోకోతో కలిసి సతీసమేతంగా 10 డౌనింగ్ స్ట్రీట్కు వెళ్లిన జైశంకర్.. రిషి సునాక్, అక్షత మూర్తి దంపతులను కలిశారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతి భవన్కు వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.
దీపావళి మూరత్ ట్రేడింగ్ 2023 శుభారంభాన్నిచ్చింది. లాభాల్లో ట్రేడింగ్ మొదలైంది. దీపావళి రోజున నిర్వహించే మూరత్ ట్రేడింగ్ను ముంబైలోని అమెరికా కన్సులేట్ జనరల్ మైఖేల్ ఘ్రూడర్, ఐఐఎం జమ్మూ చైర్మన్, పద్మశ్రీ మిలింద్ కాంబ్లే తదితరులు ఎన్ఎస్ఈ బెల్ మోగించి ప్రారంభించారు. ఆదివారం సాయంత్ర 6.15 గంటలకు ట్రేడింగ్ మొదలైంది. గంటసేపు ట్రేడింగ్ జరిగింది.
దీపావళి రోజు రంగురంగుల దీపాలు వివిధ ఆకృతులు, సైజుల్లో అందర్నీ కనువిందు చేస్తుంటాయి. మట్టితో సహా వివిధ తరహాల్లో వీటిని తయారు చేస్తుంటారు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన శ్రీ కృష్ణ బలరామ్ గోసేవా ట్రస్టు ఈసారి దీపావళికి ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంది.
Team India Diwali Celebrations: నెదర్లాండ్స్తో మ్యాచ్కు ముందు టీమిండియా క్రికెటర్లు దీపావళి సంబురాల్లో మునిగితేలారు. ఆటగాళ్లంతా సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వేడుకలు జరుపుకున్నారు. బెంగళూరులో జరిగిన ఈ వేడుకల్లో క్రికెటర్ల కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. జట్టు సిబ్బంది తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఈ వేడుకల్లో ఆటగాళ్లు ధరించిన సంప్రదాయ దుస్తులు ఆకట్టుకున్నాయి. ఆటగాళ్లంతా సంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా కనిపించారు
దీపావళి పండుగను స్వస్థలాల్లో జరుపుకునేందుకు చెన్నై నుంచి దక్షిణాది ప్రాంతాలకు సుమారు 10 లక్షల మంది బయలుదేరి వెళ్లారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకకాలంలో రికార్డు స్థాయిలో దీపాలు వెలిగించడం ద్వారా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం శనివారంనాడు సరికొత్త గిన్నెస్ ప్రపంచ రికార్డు ను సృష్టించింది. సొంత రికార్డును తిరగరాస్తూ సరయూ తీరంలోని 51 ఘాట్లలో 22.23 లక్షల దీపాలు ఏకకాలంలో వెలిగించారు.