Home » Devotional
నవరాత్రి లేదా ఇతర పూజా సందర్భాల్లో అమ్మవారి కలశాన్ని స్థాపించడం ఒక పవిత్రమైన కార్యం. ఈ స్థలాన్ని శుద్ధిగా ఉంచడం వలన ఆధ్యాత్మిక శక్తి నిలిచి ఉండటమే కాదు, శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం.
క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన యోగావతారులు లాహిరీ మహాశయుల మహాసమాధి ఆరాధనోత్సవాలు దేశవ్యాప్తంగా కన్నులపండువగా జరుగుతున్నాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన ఆశ్రమాల్లో, ధ్యానకేంద్రాల్లో క్రియాయోగులు, భక్తులు లాహిరి మహాశయులను స్మరించుకున్నారు.
ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవిగా ఆమెను భక్తులు కొనియాడుతున్నారు.
జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్రావు గుర్తుచేశారు.
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలంతా పండుగను ఘనంగా చేసుకోవాలని రేవంత్రెడ్డి, కేసీఆర్ ఆకాంక్షించారు.
మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి పోలీసు అధికారులు స్పందించారు. కపిలతీర్థంలో తొక్కిసలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తిరుపతి పోలీసు అధికారులు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా వివిధ వాహనాలపై ఊరేగే ఉత్సవమూర్తులు కిలోల కొద్దీ బంగారు, వజ్ర ఆభరణాలతో శోభాయమానంగా దర్శనమిస్తుంటారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయం వద్ద ఆక్టోపస్ సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించారు.
గిన్నిస్ బుక్ రికార్డులో చేరే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్తగా కవులు, రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలు పాడేలా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు వాహన సేవ దర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో రెండు లక్షల మందికి వాహన సేవలను ప్రత్యక్షంగా చూసేలా అవకాశం కల్పిస్తున్నట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు.