Home » Devotees
మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి పోలీసు అధికారులు స్పందించారు. కపిలతీర్థంలో తొక్కిసలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తిరుపతి పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయం వద్ద ఆక్టోపస్ సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించారు.
గిన్నిస్ బుక్ రికార్డులో చేరే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్తగా కవులు, రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలు పాడేలా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు వాహన సేవ దర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో రెండు లక్షల మందికి వాహన సేవలను ప్రత్యక్షంగా చూసేలా అవకాశం కల్పిస్తున్నట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై.. పూల జాతరగా మారే తెలంగాణ సంప్రాదాయిక బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులందరూ ఎదురుచూస్తారు. ఎంతో ఉత్సాహంగా సాగే బతుకమ్మ సంబురాల కంటే ముందు బొడ్డెమ్మ ముందుకు వస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్లోని 16 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. ఈ క్రమంలో కార్యక్రమ పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా బాసిల్లుతూ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సాంస్కృతిక పర్వం బతుకమ్మ. ఆ బతుకమ్మ పర్వానికి కచ్చితంగా తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే వేడుకే బొడ్డెమ్మల పర్వం.
వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర జనసంద్రాన్ని తలపించింది. గురువారం ఉదయం 4 గంటలకే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో గురువారం రాత్రి వినాయకస్వామి కల్పవృక్ష వాహనంలో దర్శనమిచ్చారు.
రాబోయే ఏడాది వినాయక్ సాగర్లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.