Home » Devotees
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం జాతరలో నేడు తొలి ఘట్టం ఆవిష్కృతమవుతోంది. మండమెలిగే పండుగతో మొదలవుతున్న.. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం.. లక్షలాది మంది భక్తుల రాకతో మరింత వైభవంగా కొనసాగనుంది.
తెలంగాణలోని మేడారం జాతరకు రాష్ట్రంలోని 51 సెంటర్ల నుంచి 4వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మేడారానికి వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా దేవాదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఆన్లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది..
బాసర సరస్వతీ దేవి ఆలయంలో అవకతవకలు జరుగుతున్నట్లు విజిలెన్స్ బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. సాధారణ భక్తుల రూపంలో ఆలయంలోకి వచ్చిన అధికారులు.. ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు..
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారికి నిర్వహించే నిత్య పూజలో ఉపయోగించే పాలలో పురుగు కనిపించడంతో తీవ్ర కలకలం నెలకొంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం అర్చన సమయంలో చోటు చేసుకుంది..
తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం వేకువ జామున శ్రీవారి ఆలయంలోని పవిత్రమైన వైకుంఠ ద్వారాలను అధికారికంగా మూసేసింది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ దర్శనం భక్తులకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఈ అపూర్వ దర్శనానికి తరలివచ్చారు.
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటారు. అప్పన్నస్వామిని దర్శించుకున్న అనంతరం వారికి తోచిన కానుకలను సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో విశాఖపట్నం సింహాచలం అప్పన్నస్వామి హుండీకి భారీ ఆదాయం వచ్చింది..
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత తొమ్మిది రోజులుగా లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం.. వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించింది.