Home » Deputy CM Pawan Kalyan
తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు.
వాలీబాల్ ఆడటానికి పోల్స్ నిలబెడుతున్న సమయంలో విద్యుతాఘాతంతో ఏడిద చరణ్ అనే యువకుడు మృతిచెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.
ప్రజలు తలపెట్టే అన్ని శుభకార్యాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే.. మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.
మచిలీపట్నంలో హోంగార్డ్పై జనసేన నేత కర్రి మహేష్ దాడి చేశాడు. ఈ ఘటనపై జనసేన అధిష్టానం చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడిన కర్రి మహేష్పై సస్పెన్షన్ వేటు వేసింది.
చిరంజీవిగా ప్రేక్షకులను రంజింపచేసి ధ్రువ తారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకు ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఆయన జీవితం వెల కట్టలేని జీవిత పాఠమని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మెగా అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. శుక్రవారం మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మెగా అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని కాపాడాలని ఏపీ ప్రభుత్వాన్ని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
సీపీ రాధాకృష్ణన్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు. నుదిటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించామని తెలిపారు.