Home » Deputy CM Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఓ సందర్భంలో వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుందని... మహిళలు అపహరణకు గురి అవుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గురువారం ఈ కేసు పిటీషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ప్రస్తావించి అతడి వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.
ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మత్స్య సంపద పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఏపీ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ నిజమైన కర్మయోగిగా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు పవన్ కల్యాణ్.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి గర్భాలయ శిఖరాన్ని దర్శించుకున్నారు. అలాగే రుద్రాభిషేకం నిర్వహించి, అమ్మవారికి కుంకుమార్చన చేశారు.
పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.
గమ్యస్థానం నుంచి ‘ వికసిత్ భారత్’కు మార్గం ఇప్పుడు సుగమం అవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం గూగుల్ ఏఐ డేటా సెంటర్ను, భారతదేశపు మొట్టమొదటి ఏఐ నగరాన్ని పొందడం గొప్ప ముందడుగని పవన్ కల్యాణ్ అభివర్ణించారు.