Home » Delhi
ఢిల్లీలోని సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగబోతోన్న తరుణంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలు చర్చించారు.
దేశంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేపర్లకే పరిమితం అవుతుంది కానీ రైతులకు న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదికపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో మంటలు చెలరేగగా.. ప్రమాదాన్ని పసిగట్టి తేరుకునేలోపే మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
జమ్మూకశ్మీర్ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చిన 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్'కు సంబంధించి ఏడుగురికి పైగా అనుమానితులను ఇంతవరకూ అరెస్టు చేసారు. ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్కు నేరుగా ఢిల్లీ పేలుడుతో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
ప్రజల ఆరోగ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి అవసరమని.. ఢిల్లీ కాలుష్యంపై విమర్శలు చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
చవక.. చవక.. క్యాబ్ కంటే ఫ్లైట్ ప్రయాణం చవక.. అంటూ నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో అర్బన్ కమ్యూటింగ్ లగ్జరీగా మారిపోతోందని కొందరంటుంటే, భారతదేశంలో ట్రాన్స్పోర్టేషన్ ధరల మధ్య తీవ్ర తేడాల్ని హైలైట్ చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈరోజు ద్వారకలో యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులకు గ్యాంగ్ స్టర్ హిమాన్షు భావు ముఠా సభ్యుడు అంకిత్ కి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటన తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీలోని వాయు కాలుష్యం నేపథ్యంలో బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం మానేశానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీ కాలుష్య సమస్య ఏంటనేది అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క కారణంతో ఈ పరిస్థితి రాలేదని పేర్కొన్నారు.
శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.