Home » Delhi
ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆమె ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఓబీసీల్లో ముస్లింలను మూకుమ్మడిగా చేరుస్తున్నారని.. ఓబీసీలు వెనకబడడానికి కారణమవుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాజ్యసభలో ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు విడతల్లో జనగణన జరుగుతుందని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనగణనలో భాగంగా ఇళ్ల సర్వే జరుగుతుందని వెల్లడించారు.
లైంగిక దాడులకు గురైన బాధితుల ఆత్మగౌరవాన్ని, గోప్యతను కాపాడాల్సిన విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.
ఓ బాలుడు ఫ్లైఓవర్పై ప్రాంక్ చేశాడు. రోడ్డుపై వెళుతున్న బైకర్లపై కారులోంచి వాటర్ బెలూన్లు విసిరాడు. పిల్లాడు చేసిన తప్పునకు కారు ఓనర్ అడ్డం బుక్కయ్యాడు. పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి రేపటి నుంచి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.
ఆయిల్, గ్యాస్ కొరతపై పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశంలో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ ఇంధన అవుట్లెట్లలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది.
ఢిల్లీ అసెంబ్లీకి బుధవారంనాడు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ బాంబు బెదిరింపులు రావడం గత 24 గంటల్లో ఇది రెండోసారి.
దేశ రాజధానిలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి అధికారులు నోటీసు అందించారు. ల్యుటియన్స్ జోన్ ఖాళీ చేయాలని అక్బర్ రోడ్లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎగ్జిట్ నోటీసు ఇచ్చారు. అలాగే 5వ నెంబర్ రైసినా రోడ్లోని యూత్ కాంగ్రెస్ ఆఫీస్ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.