Home » Cyber Crime
క్యూనెట్ సంస్థ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఘరానా మోసం చేస్తోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న క్యూనెట్ సంస్థపై దాడులు చేసి 32 మంది నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసగించారు. ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 లక్షలు కొట్టేశారు.
ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు కాజేశారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సైబర్ మోసం కేసులో ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్తను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ డీజీపీ మనుమరాలైన బాధితురాలికి చెందిన సంస్థలో వాట్సాప్ ద్వారా మోసం చేసి భారీగా నగదు కాజేశారు.
నగరంలో సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. షేక్పేటలో నల్లా బిల్లు చెల్లించాలని ఏపీకే ఫైల్తో రూ.5.51లక్షలు కాజేయగా.. ట్రేడింగ్ పేరుతో సికింద్రాబాద్లో ఓ వృద్దుడికి రూ.42.75లక్షలు శఠగోపం పెట్టాడు.
నగరవాసుల నుంచి ఒకేరోజులో భారీ మొత్తాన్ని సైబర్నేరగాళ్లు దోచుకున్నారు. పెట్టుబడుల పేరుతో నలుగురిని నమ్మించి నట్టేట ముంచారు.
షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ.27లక్షల మేర మోసం చేసిన ఘటన సైబరాబాద్లో వెలుగుచూసింది.
డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక జనం నుంచి లక్షల్లో డబ్బు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సింబా ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవల, ఫేక్ ఈ-చలాన్ మోసాల కేసులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఈ మోసాలకు గురి కాకుండా కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పార్ట్ టైమ్ ఆన్లైన్ ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసగించి సైబర్ మోసగాళ్లు రూ.3.80 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.