Home » Cyber Crime
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. నకిలీ యాప్ ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. అయితే.. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది,
సైడర్ కేటుగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలు వాట్సాప్ డీపీగా పెట్టి వలపు వల విసిరి... లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగాగా ఇటువంటా సంఘటనే నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
హైదరాడాద్ నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహా మోసాలకు బలవుతూనే ఉన్నారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 14.34 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.
ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్గా మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నకిలీ కాల్ సెంటర్ ద్వారా సైబర్ నేరాలు చేస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ డాక్టర్ భారీగా నగదును పోగొట్టుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ను సైబర్ కేటుగాళ్లు ఈజీగా మోసం చేసి పెద్ద మొత్తంలో నగదును కొట్టేశారు.
సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రతి ఏటా రూ.1500 కోట్ల నగదును కొల్లగొడుతున్నారు. పెరిగిన సాంకేతిక రంగాన్ని ఉపయెగిచుకుంటూ అడ్డంగా దోచేస్తున్నారు. ప్రజల్లో ఈ సైడర్ మోసాలపై అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది.
ఓ వృద్ధుడు సైబర్ మోసగాళ్ళ చేతిలో బలైపోయాడు. రూ.1.36లక్షలను పోగోట్లుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్కు చెందిన వృద్ధుడొకరు అమెజాన్ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్లో వెతికి సైబర్ నేరాగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీశైలం మల్లన్న భక్తులను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ఫేక్ వెబ్ సైట్ పెట్టి.. వసతి గదుల పేరుతో భారీగా డబ్బులను కాజేశారు.
సైబర్ నేరగాళ్లు సరికొత్త పంధాను ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో, వాట్సాప్లో బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేర్లతో సైబర్ నేరగాళ్లు ఏపీకే లింక్లు పంపుతున్నారు. ఈ లింక్లను ఓపెన్ చేస్తే.. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయమైపోతోంది. ఈ తరహ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచిస్తోంది.
ఐబొమ్మ రవిని గత నాలుగు రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో పోలీసులకు రవి సరిగా సహకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి.