Home » Crime News
ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు చేయడం కలకలం రేపింది. ఆధ్యాత్మిక కేంద్రం ముసుగులో మత్తు పదార్థాల దందా చేస్తున్న ఆ స్వామీజీ గుట్టును పోలీసులు రట్టు చేశారు.
అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారానికి గురైన ఆ చిన్నారికి సరైన వైద్యం అందక మృతి చెందడంతో సదరు వైద్యులపై సుప్రీంకోర్టు మండిపడింది.
నల్లగొండ జిల్లా అనుముల మండలానికి చెందిన ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కొంతకాలంగా నిందితులిద్దరూ చిన్నారిని బెదిరించి లైంగిక దాడికి తెగబడుతున్నారు. దీంతో బాలిక గర్భం దాల్చగా.. నిందితులపై పోక్సో కేసు నమోదు అయ్యింది.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ చిన్నారిపై కన్నతల్లే దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా వి.కోటలో చోటుచేసుకుంది. ఏకాంతంగా గడిపేందుకు ఇబ్బందిగా ఉందని ప్రియుడు చెప్పడంతో కుమారుడిపైనే దారుణానికి ఒడిగట్టింది.
ఢిల్లీలో సంచలనం రేపిన ఐర్ఆస్ఎస్ ఆఫీసర్ కుమార్తె హత్యాచారం కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసులో మొత్తం 82 మంది సాక్షుల వాంగ్మూలాలతో 973 పేజీల ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేశారు.
మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తామని విశ్రాంత ఎయిర్ఫోర్స్ ఉద్యోగిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు రూ.33.50 లక్షలు కొల్లగొట్టారు.
మద్యం మత్తులో ఓ బాలుడు వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జనగామ జిల్లా చిలుపూర్ మండలంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
అడవి జంతువులను వేటాడి హైదరాబాద్లో మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును మల్కాజ్గిరి జోన్ పోలీసులు రట్టు చేశారు. శామీర్పేటలోని బిట్స్ పిలానీ జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బొలెరోలో నీల్గాయి మాంసాన్ని తరలిస్తున్న ముగ్గురు నిందితులను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ షాపింగ్ మాల్ బేస్మెంట్లో ఏడేళ్ల చిన్నారి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. పోస్టుమార్టం నివేదికలో బాలికపై హత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ని న్యాయవాది రామారావు ఇమ్మనేని ఆశ్రయించారు.