Kit String Related Death: కుటుంబాన్ని బలి తీసుకున్న మాంజా! బైక్పై వెళుతుండగా..
ABN , Publish Date - Jan 15 , 2026 | 09:31 PM
మాంజా కారణంగా మరో కుటుంబం బలైపోయింది. తమ కూతురితో కలిసి బైక్పై వెళుతున్న ఓ జంట ఫ్లైఓవర్పై నుంచి కిందపడి మరణించారు. సూరత్లో బుధవారం ఈ ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: మాంజాలు యమపాశాలుగా మారుతూ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్లకు కారణమవుతున్నాయి. తాజాగా గుజరాత్లో ఓ కుటుంబం మొత్తం మాంజాకు బలైపోయింది. గుజరాత్లోని సూరత్లో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది (Kite String Related Death in Surat).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, నగరంలోని చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్పై ఈ దారుణం జరిగింది. రేహాన్ తన భార్య, రిహానా, కూతురు అయేషాతో కలిసి బైక్పై వెళుతుండగా అతడి ఒంటికి మాంజా చుట్టుకుంది. ఈ క్రమంలో అతడి బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ గోడకు బలంగా ఢీకొంది. ఈ క్రమంలో బైక్పై ఉన్న ముగ్గురు 70 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. రేహాన్, అతడి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. రిహానా మాత్రం ఆటోపై పడటంతో తీవ్రగాయాల పాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చైనా మాంజా కారణంగా అనేక మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు అత్యధిక రిస్క్ను ఎదుర్కొన్నారు.
ఇవీ చదవండి:
హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్
మహిళా అధికారుల బదిలీపై మంత్రి కోమటిరెడ్డి ఏం చెప్పారంటే?