Home » Cricket
భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, ఆయన భార్య డోనాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. గత ఆరు నెలలుగా గంగూలీ పేరుతో పలు బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూమి.. ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రికెట్ మౌలిక సదుపాయాలకు చిరునామాగా మారింది. బీసీసీఐ ఆధ్వర్యంలో బెంగళూరులో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) వెనుక బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ జై షా పాత్ర అత్యంత కీలకం.
భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. అయితే జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. రీఎంట్రీ ఇవ్వడం వెనుక ఎంతో కఠోర శ్రమనే ఉంది. ఏడాదిన్నరగా కశ్మీర్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ.. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు.
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత సెలెక్టర్ల ఆలోచనల్లో షమీకి చోటు కనిపించడం లేదని.. అయినప్పటికీ అతడు తన ప్రయత్నాలను ఆపొద్దని సూచించాడు.
టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) హెడ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆల్రౌండర్గా నితీశ్పై అధికంగా ఉండే వర్క్లోడ్ను ఎలా సమర్థంగా నిర్వహించాలో అతడితో చర్చిస్తున్నామని చెప్పాడు.
భారత హెడ్ కోచ్ పదవిపై మాజీ క్రికెటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023లోనే తనకు భారత జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిందని.. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ పదవిని స్వీకరించలేకపోయానని వెల్లడించాడు.
పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా జరగనున్న షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్కు స్టార్ క్రికెటర్లు సిద్ధమయ్యారు. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్, యువ సంచలనం అభిషేక్ శర్మలను అధికారులు మార్కీ ప్లేయర్లుగా ప్రకటించారు.
శ్రీలంక ఎలెవన్తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.