Home » Cricket
అంపైర్లపై విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోహ్లి తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షిత్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆర్సీబీ తరఫున కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. అయినప్పటికీ కోహ్లి ఔట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు.
ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 పరుగులు చేస్తోంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 36వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
MS Dhoni Records in IPL: ఇప్పుడంతా ఐపీఎల్(IPL) మేనియా నడుస్తోంది. బ్యాటర్ల వీరవిహారంతో క్రికెట్(Cricket) ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఐపీఎల్ 16 సీజన్ల వరకు ఒక ఎత్తు.. 17వ సీజన్ ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది మ్యాచ్లు జరుగుతున్న తీరు. అవును.. ప్రతి జట్టులోని ప్లేయర్స్ ఎక్కడా తగ్గడం లేదు.
ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ధాటికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు విలవిలలాడుతున్నారు. వరసగా మూడో సారి 250 పైచిలుకు పరుగులు చేశారు. తమ రికార్డును తామే చెరిపేసుకుంటున్నారు.
పుట్టింటి నుంచి ఎంతో సంతోషంగా అత్తారింటికి పయనమైంది ఆ ఇల్లాలు. భర్త తన పట్ల చూపే ప్రేమానురాగాలకు ఎంతో మురిసిపోయింది. వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఆనందమే లేకుండా చేసింది.
ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 రన్స్ చేస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. భారీ స్కోరు నమోదు చేస్తోంది. సీజన్లో భారీ స్కోరు కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ యజమాన్యానికి కీలక సూచన చేశారు.
ఐపీఎల్ సీజన్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటానని మ్యాక్స్వెల్ ప్రకటించారు. ఈ సీజన్లో మ్యాక్స్ వెల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. నిన్నటి తుది జట్టులో చోటు లభించలేదు. మ్యాక్స్ వెల్ స్థానంలో విల్ జాక్స్ను తీసుకున్నారు. తన స్థానంలో మరొకరిని తీసుకోవాలని కెప్టెన్ డుప్లెసిస్కు మ్యాక్స్వెల్ స్పష్టం చేశారు.
Telangana: స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు ఎంతో హుషారుగా ఆటల్లో మునిగితేలుతున్నారు. ఆ బాలుడు కూడా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. కానీ ఆ బంతే అతని పాలిట యమ పాశంగా మారుతుందని ఊహించలేదు. ఇదే బాలుడికి చివరి రోజని ముందే తెలిస్తే తల్లిదండ్రులు కూడా వెళ్లనిచ్చేవారు కారేమో. కానీ జరిగాల్సిన దారుణం జరిగిపోయింది.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించారు. నిన్నటి మ్యాచ్లో సెంచరీ చేసినప్పటికీ.. కనీసం బ్యాట్ పైకి లేపలేదని గుర్తుచేశారు. తన వ్యక్తిగత రికార్డుల కన్నా.. జట్టు ప్రయోజనాలు ముఖ్యమని భావించారని లీ పేర్కొన్నారు.
ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ మంచి ఊపు తీసుకొచ్చింది. చివరి ఓవర్లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల వరద పారించాడు. కేవలం నాలుగు బంతుల్లో ఎదుర్కొని 20 పరుగులు చేశాడు.