Home » Congress
మునిసిపల్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ఆకర్శించడానికి రకరకాల ఎత్తులు ప్రదర్శిస్తున్నారు. మైకులు, కళాకారుల ఆట పాటలతో ప్రచారాన్నిహోరెత్తిస్తున్నారు.
దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన.. అని అన్నారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాష్రెడ్డి. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, తాను సంగారెడ్డిలో ఓడిపోవడం చాలా బాధేసిందన్నారు.
అనంతపురం జిల్లా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె మాట్లాడుతూ... యాత్రతో పార్టీకి పునర్వైభవం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్నారు.
మంత్రి వివేక్వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని, ఆ మాట కేసీఆర్ బిడ్డ కవితనే చెబుతున్నదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు.
ఎమ్మెల్యే మోసం చేసిండు.. నమ్మించి గొంతు కోసిండు.. అంటూ ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మరిపెడ మునిసిపల్ 2వ వార్డు నుంచి కాంగ్రెస్ రెబల్ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీలో ఉన్న బానోత్ బుజ్జిదావు కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తింది. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థలు జాబితా వెల్లడైంది. ఈ ప్రక్రియ పూర్తవగా ఆక ప్రచారాల హోరు జోరందుకుంది. అలాగే ‘విందు’ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కిందపడిపోయారు. బుధవారం నాడు పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. అయితే..
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, బీఫామ్ల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీకి సిద్దమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ మధ్య మున్సిపాలిటీల్లో మాత్రం పొత్తులు పొసగలేదు.
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్ ఫోన్ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ మినహా బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది.