Home » Congress
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రేపు(ఆదివారం) సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నలు సంధిస్తూ లేఖ విడుదల చేశారు. రేపు సిద్దిపేట నియోజకవర్గానికి చేసిన ద్రోహం, నిధుల రద్దుపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.
మొయినాబాద్ ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’ విసిరారు. బీఆర్ఎస్ నేతల ఛాలెంజ్ స్వీకరించి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎల్బీనగర్ చేరుకున్నారు.
అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ లోక్సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ భారతీయ జనతా పార్టీలో బుధవారంనాడు చేరారు.
ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
కాంగ్రెస్ను బలహీనపరచడానికే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. జీవన్ రెడ్డికి పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేస్తూ, కేసీఆర్ బాధ్యతగా శాసనసభకు హాజరవ్వాలని సూచించారు.
భట్టి విక్రమార్క ఛాంబర్లో కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహేష్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు.
ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హుకుం జారీ చేశారు.
అన్నదాతల సమస్యలను పట్టించుకోవడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహించారు.
కొందరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ కేవలం పండుగ మాత్రమే కాదని, ఆత్మశుద్ధి చేసుకునే సమయమని అన్నారు.
ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.