Home » Congress
జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ పార్లమెంటరీ ఇన్నింగ్స్ ముగిసింది. కర్ణాటకలో పొత్తులో భాగంగా మరోసారి రాజ్యసభ టిక్కెట్ను దేవెగౌడకు ఇవ్వాలని జేడీఎస్ ఆశించింది. అయితే బీజేపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రొఫెసర్ ఎం.నాగరాజును ప్రకటించింది.
ఇండియా బ్లాక్ పార్టీలు దేశ రాజధానిలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈరోజు (సోమవారం) కూటమిలోని అన్నీ పార్టీల నేతలంతా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదు కీలక నిర్ణయాలను ఇండియా కూటమి నేతలు ప్రకటించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కిరణ్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.
నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రధాని చేతగానితనం వల్ల లక్షలాది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి డా. సుచి గౌడ్ కారు ప్రమాదంలో గాయపడ్డారు. అమెరికాలో ఈ కారు ప్రమాద ఘటన చోటుచేసుకుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం తమ కీలక భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్కు రాజ్యసభ స్థానం కేటాయించింది. తమిళనాడు నుంచి రాజ్యసభ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరుగనుంది.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రెస్మీట్లో పవన్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్తో పాటు తల్లి, భార్య ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ ఘటన తమ కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన లోక్భవన్కు వెళ్లి.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదని, త్వరలో జరుగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు.