Home » Congress
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమి చెందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొందరు కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకోవడంపై ఆ పార్టీ అగ్రనేత సీరియస్ అయ్యారు. ఇది ఒక పార్టీ ఓటమి మాత్రమే కాదని.. దేశ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే దిశగా బీజేపీ వేసిన అడుగని ఆయన వ్యాఖ్యానించారు.
కేరళం ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సంకేతాలేంటి. కాంగ్రెస్ తొడగొట్టి అంత భారీ విజయాన్ని ఎలా నమోదు చేసింది. కాంగ్రెస్ వ్యూహాలు ఎలా పనిచేశాయి.
కేరళం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్కు షాక్ తగిలింది. జోర్హాట్లో బీజేపీ సీనియర్ నేత హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో 28వేల ఓట్లకు పైగా తేడాతో గొగోయ్ ఓటమి పాలయ్యారు.
పశ్చిమబెంగాల్లో ఎన్నో అరాచకాలు జరిగాయని.. బంగ్లా చొరబాటు దారులకు దారులు మూసుకుపోయాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశం అంతా బీజేపీని కోరుకుంటోందని ఉద్ఘాటించారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీ ట్రబుల్ షూటర్గా పేరున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను రంగంలోకి దింపింది.
సీఎంపై హాట్ కామెంట్స్తో నిరంతరం మీడియాలో ఉండాలన్న తపన తప్పితే కేటీఆర్కు ఇంకో పని లేదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ భవన్కు ఎవరినో ఒకరిని పిలిపించుకుని చిల్లర మల్లర అహంభావపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల నుంచి దూరంగా ఉంటే ఏ పార్టీ అయినా బతకదని, అందుకే కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘మేం సరిగ్గానే ఉన్నాం.. ప్రజలే మారాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్ను అడ్డుకోవడం సిగ్గుచేటు అని ఎంపీ రఘునందన్ రావు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అవగాహన లేకపోవడం వల్లే మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ హయంలో అనేక మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్న పాపం కేసీఆర్దని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్ నేతలకు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు.