Home » Congress
Telangana: పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్కు అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు.
‘నమస్తే.. బాస్. మీ ఏరియాలో రెండు ఓట్లూ మన పార్టీకే పడ్డాయా, లేక ఒక ఓటు అటు, ఇంకో ఓటు ఇటు పడి ఉండవచ్చా?’ అంటూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై ఆయా రాజకీయ పార్టీల విశ్లేషణ కొనసాగుతున్నది.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ.. అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు.
వివిధ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేర తీసుకున్న గ్యారంటీ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘రుణాల రీస్ట్రక్చరింగ్’పై పరిశీలన చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రం అప్పులకుప్పలా మారిపోయిందని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అడ్డగోలు అప్పులు గుదిబండలా మారాయని రేవంత్ సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. కాంగ్రె్సకు 125 సీట్లు వచ్చినా సరిపోతుందని, కూటమిలోని భాగస్వామ్యపక్షాలు మద్దతు ఇస్తాయని సీఎం రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మాత్రం ఆ పార్టీకి 250కి పైగా సీట్లు రావాల్సి ఉంటుందన్నారు. ‘బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ) దాటలేకపోతే.. మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీకి నమ్మకమైన మిత్రులెవరూ లేరు. కాంగ్రెస్ పరిస్థితి వేరు. మాకు మద్దతు పలికేందుకు అనేక మిత్రపక్షాలు సిద్ధంగా ఉన్నాయి’ అని వివరించారు.
రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను ఓడించేందుకు గత్యంతరం లేని పరిస్థితిలోనే కాంగ్రె్సను గెలిపించారని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నా రు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే చీ కొట్టించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఖరీఫ్ పంట కార్యాచరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాయత్తమైంది. ఆ క్రమంలో రుణమాఫీ పథకం విధివిధానాలపై గురువారం హైదరాబాద్లో మంత్రులు.. టీఎస్ సీడ్స్ ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.
Telangana: రైతుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు అనేక రకాలుగా పంటనష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని మొక్కుబడిగా చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత పట్టించుకోలేదన్నారు. అనేక మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదన్నారు.
Telangana: మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న కామెంట్స్పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. పద్మశాలిలు నిరోద్లు అమ్ముకోవాలంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలిలను అనలేదనీ, ఒక వ్యక్తితో వేరే సందర్బంలో మాట్లాడిన వాటిని కట్అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని తెలిపారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనుందా? ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిందా? జూన్ 4న ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఏ క్షణాన్నైనా బదిలీ ఉత్తర్వులను విడుదల చేయనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, పరిపాలనలో ప్రభుత్వ అవసరాలు ఔననే చెబుతున్నాయి. ఈ క్రమంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్న ఒకరిద్దరు అధికారులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.