Home » Congress
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఖండించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, సెంటిమెంట్ను రగిలించడం బీఆర్ఎస్ సిద్ధాంతమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడ్జెట్కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక నిర్మలా సీతారామన్ పక్కన పెట్టారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ద్రవ్యలోటు, పన్నుమార్పుల్లో కూడా తేడా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయనవి ‘గాలి’ మాటలు.., ఆయన చెప్పేవాటిలో ఒక్కటికూడా నిజం లేదని గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి జనార్దన్రెడ్డిపై మాజీ మంత్రి, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర మండిపడ్డారు. పవిత్రమైన శాసనసభకు గాలి జనార్దన్రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన స్వంత పార్టీ మీటింగ్కు దూరంగా ఉండిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంట్లో జరిగిన పార్టీ సమావేశానికి గైర్హాజరయ్యారు.
జనవరి 27న తన ఇంటిపై దాడికి ప్లాన్ చేసినట్టు కొందరు కాంగ్రెస్ పార్టీ సన్నిహితులు చెప్పారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షకీల్ అహ్మద్ తెలిపారు. తన వాదనకు సాక్ష్యంగా వాట్సాప్ మెసేజ్లను కూడా ఆయన పోస్ట్ చేశారు.
మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదంటూ ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆఎర్ఎస్ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారని, అధికారం పోయిననాటి నుంచి ఒంటినిండా విషం నింపుకుని కాంగ్రెస్ పట్ల విషం చిమ్ముతున్నారని ఆయన అన్నారు.
సంగారెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ను అవమానించిన మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీభవన్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.