Home » Congress
మాజీ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డిని సీఎం చేసింది తానేనని, సినిమాల్లో సీఎం పాత్ర చేయాలని ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మట్టి తరలింపు విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు బాహాబాహీకి దారితీసింది.
అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీకి కాంగ్రెస్, రాహుల్ గాంధీ బి-టీమ్ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అత్యంత సీనియర్, గౌరవప్రదమైన నాయకుడు. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్కి వెన్నుముకగా ఉన్న ఆయన, ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారనే వార్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఐదు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ల భేటీ ముగిసింది. పార్టీ పెద్దల తీరుపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రేపు(ఆదివారం) సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నలు సంధిస్తూ లేఖ విడుదల చేశారు. రేపు సిద్దిపేట నియోజకవర్గానికి చేసిన ద్రోహం, నిధుల రద్దుపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.
మొయినాబాద్ ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’ విసిరారు. బీఆర్ఎస్ నేతల ఛాలెంజ్ స్వీకరించి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎల్బీనగర్ చేరుకున్నారు.
అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ లోక్సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ భారతీయ జనతా పార్టీలో బుధవారంనాడు చేరారు.