Home » Congress
అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు దసరా పండగ ఖర్చు భారీగానే అవుతోంది. మద్యం, మామూళ్లు ఇవ్వాలంటూ చోట, మోటా నేతలు ఆశావహుల ఇళ్ల వద్ద క్యూ కట్టారు. కొందరూ ఆశావహులు రెండు రోజులుగా పంపకాలను ప్రారంభించారు.
కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్ను సూటిగా ప్రశ్నించారు.
ముంబై ఉగ్రదాడుల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబరం బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ప్రపంచం అంతా యుద్ధం ప్రారంభించవద్దని చెప్పడానికి ఢిల్లీకి వస్తోందని, నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైస్ ప్రత్యేకంగా తనను, ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వచ్చారని చిదంబరం తెలిపారు.
వైఎస్ షర్మిల జీవితంలో ఎప్పుడైనా దేవాలయాలను సందర్శించారా? అని మాధవ్ ప్రశ్నించారు. మత ప్రచారాలు స్వయంగా భర్తతో కలిసి చేశారని ఆరోపించారు. మత మార్పిడి చేయాలని పెద్ద ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుచ్చిలో మీడియాతో చిదంబరం మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనపై తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కె.సెల్వపెరుంతగై పార్టీ వైఖరిని చెప్పారని, తన అభిప్రాయం కూడా అదేనని తెలిపారు. అయితే నిన్న, ఈరోజు వార్తాపత్రికలు చదవడం, టీవీలో విజువల్స్ చూసిన తర్వాత అన్ని వైపుల నుంచి లోపాలు ఉన్నట్టు తనకు అనిపించిందని చెప్పారు.
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు తాము 'బాకీ కార్డులను' తీసుకెళ్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ(సోమవారం) విచారణ జరుపనున్నారు. ఈరోజు విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మహిపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరుకానున్నారు.