Home » CM Siddaramaiah
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఓ కీలక పదవి వరించే అవకాశాలున్నాయనే వార్తలను పార్టీ వర్గాలు వెల్లడిస్తుండగా.. ఆ పదవి ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
కేవలం సబ్సిడీలకోసం సినిమా తీయవద్దని, ఇటీవల సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడిందని, మంచి సినిమాలు తీసి రాయితీ పొందాలని సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి ఏడాది సినిమా పురస్కారాలు ఇస్తామన్నారు.
రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.
రాష్ట్రంలో పోలీసులు వాడుతున్న క్యాప్ను మార్చాలని నేనే సూచించానని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు కొత్త టోపీల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. పీక్ క్యాప్ను కానిస్టేబుళ్లకు ధరింపచేసి ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ఎంతోమంది కొలిచే చాముండేశ్వరి, మారెమ్మ ఆలయాలు కాంగ్రెస్ వారికి ఇష్టం కావని, ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి కప్పం కడితేనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ప్రతిపక్షనేత అశోక్ వ్యాఖ్యానించారు.
బిహార్ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది.
తాను రాజకీయగా ఎదిగేందుకు, మంత్రి అయ్యేందుకు ఆర్ఎల్ జాలప్ప కూడా కారణమని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. జాలప్ప శతజయంతి సందర్భంగా ఆదివారం జాలప్ప అకాడమీ, జాలప్ప లా వర్సిటీ, శతమానోత్సవ భవనాలను లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో వరదలతో పది జిల్లాలు అతలాకుతలమయ్యాయని వారిని ఆదుకునే విషయంలో రాష్ట్రప్రభుత్వం కుంభకర్ణుడి తరహాలో నిద్రపోతోందని ప్రతిపక్షనేత అశోక్ మండిపడ్డారు.
రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి.
గ్రేటర్ బెంగళూరుతోపాటు భవిష్యత్తులో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే నిర్ణయంపై సీఎం సిద్దరామయ్య సమర్థించుకున్నారు. శుక్రవారం బెంగళూరులో సీఎం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.