Home » CM Siddaramaiah
బిహార్ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది.
తాను రాజకీయగా ఎదిగేందుకు, మంత్రి అయ్యేందుకు ఆర్ఎల్ జాలప్ప కూడా కారణమని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. జాలప్ప శతజయంతి సందర్భంగా ఆదివారం జాలప్ప అకాడమీ, జాలప్ప లా వర్సిటీ, శతమానోత్సవ భవనాలను లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో వరదలతో పది జిల్లాలు అతలాకుతలమయ్యాయని వారిని ఆదుకునే విషయంలో రాష్ట్రప్రభుత్వం కుంభకర్ణుడి తరహాలో నిద్రపోతోందని ప్రతిపక్షనేత అశోక్ మండిపడ్డారు.
రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి.
గ్రేటర్ బెంగళూరుతోపాటు భవిష్యత్తులో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే నిర్ణయంపై సీఎం సిద్దరామయ్య సమర్థించుకున్నారు. శుక్రవారం బెంగళూరులో సీఎం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
బీజేపీ చేపట్టిన చలో ధర్మస్థల.. అదొక రాజకీయ యాత్ర అని, తద్వారా ఎలాంటి లాభం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కేవలం వారు రాజకీయలబ్ధికోసమే యాత్ర చేశారన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థల, చాముండి కొండలు, దసరా ఉత్సవాల విషయంలో బీజేపీ(BJP) బూటకపు నిరసన సాగిస్తోందన్నారు.
మైసూరు దసరా ఉత్సవాలను ఈ ఏడాది బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్ చేత ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంపై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ధర్మస్థలలో సాగుతున్న వివాదం వెనుక కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందని.., హిందూ మతం, ఆలయాలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు కమ్యూనిస్టు భావాలు కలిగిన అర్బన్ నక్సల్స్కు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ప్రతిపక్షనేత అశోక తీవ్రంగా ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ల చౌర్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోని బీజేపీతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రాహుల్గాంధీ తీరుపై మండిపడుతున్నాయి.
నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతోపాటు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష నియామకాలకు సంబంధించి అధిష్టానతో చర్చించేందుకు సీఎంతో కలసి ఢిల్లీ వెళ్లనున్నట్టు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం సదాశివనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన అధిష్టానంతో భేటీ అయి అన్ని విషయాలు చర్చిస్తామన్నారు.