Home » CM Revanth Reddy
కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మృతిచెందారనే సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా ఎమిరైట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ శనివారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎంతో చర్చించారు.
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ఉందన్నారు.
తెలంగాణ విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2.0 ర్యాంకింగ్లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది.
కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్( కార్పొరేట్ వ్యవహారాలు) రాకేశ్ స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి ఈరోజు(బుధవారం) కలిశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెగిటివ్ మైండ్సెట్తో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే ఎన్డీఎస్ఏ సాకు చెబుతున్నారని.. మరి సమ్మక్క బ్యారేజీ మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు.
డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన చట్టాలను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిపాలన వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.