Home » CM Revanth Convoy
వరుణయాగంలో పాల్గొనేందుకు సోమవారం నాగార్జునసాగర్కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి దంపతులు.. గత స్మృతులను నెమరువేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల తొలి పరిచయం నాగార్జునసాగర్లోనే జరిగింది.
భారత్ ఫ్యూచర్సిటీకి నీటి సమస్య రాకుండా ఉండేలా.. ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’లో భాగమైన ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో దీనికి సంబంధించిన నివేదికను సమర్పించారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ కాదని, 89 కేసులున్న రేవంత్ను ముఖ్యమంత్రిగా చేయడమే ‘‘క్రిమినల్ వేస్ట్’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను, యువతను అవమానించే ఆర్హత ముఖ్యమంత్రికి లేదని చెప్పారు.
రాష్ట్ర పోలీసింగ్ కొత్త ఒరవడి దిశగా దూసుకెళుతోంది. పోలీసు ఉన్నతాధికారులు కేవలం సమావేశాల్లోనే కాకుండా క్షేత్రస్థాయిలో.. ఆదేశాలతో మాత్రమే కాకుండా ప్రత్యక్ష పర్యవేక్షణతో ‘ప్రజల మధ్య పోలీసింగ్’కు కొత్త నిర్వచనం ఇస్తున్నారు.
కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాహుల్ గాంధీ మహిళలను మోసం చేశారని, తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని, ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అసత్య ప్రచారానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు విమర్శించారు. సీట్ల పెంపు అనేది 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.
తెలంగాణ సమగ్రాభివృద్ధి కేవలం భవన నిర్మాణాలతోనే సాధ్యం కాదని, నాణ్యమైన విద్య, వైద్యం సామాన్యుడికి చేరినప్పుడే అసలైన ప్రగతని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చే విధంగా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రవాణా, వైద్య రంగాల్లో భారీ మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే..
రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. తొలి రోజే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది.
బావ, బామ్మర్దుల నస భరించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు పట్టిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లు బందిపోట్ల లాగా దోచుకున్నారని ఆయన