Share News

Ponnam: చెక్ పోస్ట్‌ల మాటున గత పదేళ్లలో పాపాల పుట్టలా అవినీతి: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:04 PM

చెక్ పోస్ట్‌ల మాటున గత పదేళ్లలో పాపాల పుట్టలా అవినీతి పెరిగిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇప్పటికే వాహన్, సారథి లో 28 రాష్ట్రాలు చేరాయని.. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు చేరలేదంటూ ఆయన ప్రశ్నించారు.

Ponnam: చెక్ పోస్ట్‌ల మాటున గత పదేళ్లలో పాపాల పుట్టలా అవినీతి: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar

హైదరాబాద్, అక్టోబర్ 22: చెక్ పోస్ట్‌ల మాటున గత పదేళ్లలో పాపాల పుట్టలా అవినీతి జరిగిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇప్పటికే వాహన్, సారథిలో 28రాష్ట్రాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు చేరలేదు? అని పొన్నం ప్రశ్నించారు. 'ఇప్పుడు మేము వాహన్, సారథిలో చేరాం. డేటా ట్రాన్స్‌ఫార్మింగ్ జరుగుతోంది. వాహన్ అమలు చేస్తున్నాం.. సారథి అమలు చేస్తాం.. చెక్ పోస్టులు రద్దు చేసినా వాహనాల్లో అక్రమ రవాణా జరగకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్కువగా చేస్తాం' అని పొన్నం చెప్పారు.

'వాహన్' (VAHAN) ఇంకా 'సారథి' (SARATHI) అనేవి భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందించిన డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ ప్లాట్‌ఫార్మ్స్. ఇవి దేశవ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించిన వ్యవస్థలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి రూపొందించారు. 1. వాహన్ (Vehicle Registration System) ముఖ్య ఉద్దేశ్యం.. దేశవ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ లోకి తీసుకురావడం. 2. సారథి స్కీమ్.. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రవేశపెట్టారు.


ఇవాళ (బుధవారం) హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం అనేక అంశాలపై మాట్లాడారు. 'తెలంగాణలో చెక్ పోస్టులు రద్దు ఈరోజు నుంచి అమలు చేస్తూ జీవో జారీ చేశాం. చెక్ పోస్టుల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి చర్యలు చేపడతాం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా ఆన్ లైన్ లో జరగడానికి చర్యలు చేపట్టాం. చెక్ పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకొని.. ఈరోజు నుంచి అమలు చేస్తున్నాం. తెలంగాణలో ఈవీ(EV) పాలసీ తీసుకొచ్చిన తర్వాత రూ.577కోట్ల ట్యాక్స్ ప్రభుత్వం మినహాయించింది. ఈవీ వెహికిల్ అమ్మకాల షేర్ 0.03 నుంచి 1.13 శాతానికి పెరిగింది' అని పొన్నం తెలిపారు.


ఢిల్లీ పొల్యూషన్ పరిస్థితి ఇక్కడ లేకుండా ఉండడానికి 'ఈవీ' పాలసీ తీసుకొచ్చాం. నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చాం. LPG, CNG ఆటోలకు 10 వేలు చొప్పున అనుమతి ఇచ్చాం. 25 వేల రేటిరో ఫిటింగ్ ఆటోలకు అనుమతి ఇచ్చాం. రాష్ట్రంలో 'వాహన్' అమలవుతోంది. 'సారథి' త్వరలోనే తీసుకొస్తాం. 'స్క్రాపింగ్ పాలసీ' తీసుకొచ్చాం. వాహనాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేడియం స్టిక్కర్స్ అమలయ్యేలా తెచ్చాం. AI టెక్నాలజీను ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయాల్లో రికార్డ్ చేస్తూ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని నోట్ చేసి.. హెడ్ ఆఫీస్ కి అలెర్ట్ చేస్తుంది. అలాంటి వాటిని నిరోధించడానికి ఏఐ ఉపయోగిస్తున్నాం. వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నాం. డ్రైవింగ్ మీద మంచి నైపుణ్యాలు పెంచడానికి అవగాహన కలిగించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. రోడ్ సేఫ్టీ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నాం. నాచారం పార్క్ ను గవర్నర్ ప్రారంభించారు. కరీంనగర్ లో కూడా ప్రారంభించుకున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. టూరిజం వెహికల్స్ డబుల్ నెంబర్ ప్లేట్ తో పోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నాం. రోడ్ సేఫ్టీ క్లబ్స్ ద్వారా.. జూనియర్, డిగ్రీ, ఇతర కాలేజీలలో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 'క్యాష్ లెస్ ట్రీట్మెంట్' కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాని అమలు పై మెడికల్, పోలీస్, నేషనల్ హైవేస్ తో సమీక్షా సమావేశం జరిగింది. రవాణా శాఖ రెవెన్యూ కలెక్షన్ చేసే డిపార్ట్మెంట్ లో 112 మంది AMVI లను నియమించి వారికి శిక్షణ ఇచ్చాం. నలుగురు ఆర్టీవో లు గ్రూప్ 1 ద్వారా వచ్చారు. రవాణా శాఖకు ఒక లోగో తీసుకొచ్చాం. తెలంగాణ పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ మాదిరి లోగో తీసుకున్నాం. TS ను TG గా మార్చాం. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇల్లీగల్, ఓవర్ లోడింగ్ ఎన్ఫోర్స్ మెంట్ పై కఠినంగా వ్యవహరిస్తున్నాం. చెక్ పోస్టులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలకు చేరువ చేస్తున్నాం. రాష్ట్రంలో1.7 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. డిపార్ట్మెంట్ లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. పాత వాహనాలు, డబుల్ నంబరింగ్ అరికట్టడానికి మైనింగ్, ఇతర వాహనాలను మొదటి దశలో చూస్తున్నాం. రవాణా శాఖలోని 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ శాఖ, ఆర్టీసీ, ఇతర విభాగాలలోని పాత వాహనాలను స్క్రాప్ కి పంపించాలని లేఖ రాశాం. చెక్ పోస్టులను రద్దు చేయాలని నేనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి కేబినెట్ లో పెట్టడం జరిగింది. వచ్చే ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల్లో పాపాల పుట్ట లాగ అవినీతి జరిగింది. 'వాహన్', 'సారథి'లో 28 రాష్ట్రాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు చేరలేదు? ఇప్పుడు మేము 'వాహన్', 'సారథి'లో చేరాం. డేటా ట్రాన్స్ఫార్మింగ్ జరుగుతుంది. 'వాహన్' అమలు చేస్తున్నాం. 'సారథి' అమలు చేస్తాం. చెక్ పోస్టులు రద్దు చేసిన తరుణంలో వాహనాల్లో అక్రమ రవాణా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేస్తాం.' అని మంత్రి పొన్నం వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 06:49 PM