Home » CM Chandrababu Naidu
ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
నెల్లూరులో రూ.613 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వాటిలో కొన్ని పూర్తవగా, మరికొన్ని శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు.
శాఖమూరు పార్కు వద్ద 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటైంది. రేపు (సోమవారం) పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా.. ఉదయం 11:15 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్పై ఆరోపణలను చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీ మహేశ్ను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
గ్యాస్ సరఫరా అంశంపై పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న గుంటూరు జిల్లా రైతు రోశయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. రైతు రోశయ్య చేస్తున్న ప్రకృతి సాగును కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఏపీ జెన్కో ఒకే రోజు 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో జరిగింది. ఈ కాన్ఫరెన్సులో సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని పేర్కొన్నారు.