Home » CM Chandrababu Naidu
23 నెలల కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి, భరోసా కలిగించే పరిపాలన అందుతోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వైజాగ్ అంటే ఒకప్పుడు గంజాయి గుర్తొచ్చేదని.. నేడు గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తుకొస్తున్నాయన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ మేరకు కోల్కతా వెళ్లేందుకు బయలుదేరారు.
ఒమన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడుకు చెందిన షానవాజ్.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీ, క్రమబద్ధీకరణ వంటి అంశాలపై కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీలకు కలిగే ప్రతి లబ్ధిని బుడగ జంగాలకు వర్తింప చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
కలెక్టర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ సమయాన్ని 5 గంటల నుంచి 2 గంటల 49 నిమిషాలకు తగ్గించడం ద్వారా అచ్చెన్నాయుడు రికార్డు సాధించారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవియన్స్ స్వీకరిస్తున్నట్లే... ఇకపై ప్రతి శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా నిర్ణయించామని పేర్కొన్నారు.
ఏపీ సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్ రాకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘రాయలసీమ ఇప్పుడు రాయల్ సీమ’ అనే టైటిల్తో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉన్న ఫోటోను సీఎం షేర్ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ అండ్ కో చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.