Home » CM Chandrababu Naidu
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న రాజముద్రను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ భవిష్యత్తుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కేడర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారికే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామని, 83 శాతం మంది కొత్తవారికి పార్లమెంటరీ కమిటీల్లో చోటు కల్పించామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న సినీ నిర్మాత బండ్ల గణేశ్ కాలినొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు.
అమరావతి కేంద్రంగా టీడీపీ తన సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేసింది. జిల్లా కమిటీల నియామకం పూర్తి కావడంతో, రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో జరిగిన వేడుకల్లో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.
'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం జిల్లా వాసుల జలసంరక్షణ చర్యలను ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది తిరిగి మొదటిసారి చేపట్టిన మన్ కీ బాత్లో అనంతపురం ప్రజలు నీటి సంరక్షణలో చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను హైలైట్ చేశారని సీఎం వ్యాఖ్యానించారు.