Home » CM Chandrababu Naidu
దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రేపటిలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని.. ఆహార పదార్థాల తయారీలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అమరావతిలోని తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం గ్రామంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిసి భూమిపూజ చేశారు.
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎంను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని, రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు.
ఏపీలో ఎన్హెచ్ నెట్వర్క్ అభివృద్ధికి నిరంతరం నిధుల కేటాయింపులు జరపడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ పోర్ట్ కనెక్టివిటీపై కేంద్రం ఫోకస్ పెట్టడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది చాలక.. ఈ విషయంలో సీబీఐ సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడంపై కూటమిభాగస్వాములైన టీడీపీ, జనసేన....
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల చేసి కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని (క్వాష్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది.
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యి కల్తీ అంశంలో సిట్ ఇచ్చిన నివేదకపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంలో విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు.