Home » CM Chandrababu Naidu
అసైన్డ్ భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఏపీ అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు రానున్నాయి. రూ.40 కోట్లతో 58 ఆధునిక ఫైర్ఫైటింగ్ వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించనున్నారు.
ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ గుమ్మడి గోపాలకృష్ణకు ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు లభించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. 2024 సంవత్సరానికి థియేటర్ నటనా విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నూతన భవన సముదాయాన్ని సీఎం చేతుల మీదుగా సాధారణ పరిపాలన శాఖకు సీఆర్డీఏ అప్పగించింది.
సింగపూర్ మోడల్తో అమరావతిని నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ పెరగనుందని పేర్కొన్నారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని.. ఏపీకి ఆర్థిక రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు భావించారని మంత్రి నారాయణ తెలిపారు. తెలంగాణకు వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచే ఎక్కువగా వస్తోందన్నారు.
‘‘హద్దులు మీరే సంఘ విద్రోహ శక్తులు, రాజకీయ ముసుగు వేసుకున్న నేరగాళ్లకు చెక్ పెట్టాల్సింది మీరే. ఏపీలో ఎక్కడ చిన్న నేరం చేసినా సీసీ కెమెరాలు, డ్రోన్లకు దొరికి పోతామన్న భయం నేరస్థుల్లో కలగాలి. అభివృద్ధికి శాంతిభద్రతలు కీలకం. ప్రజలు ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని, ఇటీవలి కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది! అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభిస్తారు.
కడప బెసిన్లో కీలక ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్-నేషనల్ జియాలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)తో రాష్ట్ర గనుల శాఖ ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో గనులశాఖ, ఎన్జీఆర్ఐ ప్రతినిధులు ఒప్పందపత్రాలపై బుధవారం సంతకాలు చేశారు.