Home » CM Chandrababu Naidu
రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగువారిని గతంలో ‘మదరాసీలు’ అని పిలిచేవారని.. టీడీపీ ఆవిర్భావం తర్వాత మదరాసీ అనే ముద్ర పోయిందని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. శాసనసభలో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు.
దేశవ్యాప్తంగా అమలవుతున్న మిషన్ కర్మయోగిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతికత ఆధారిత శిక్షణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు మెరుగుపడుతోందని.. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని ప్రశంసించారు.
వడ్డెర్ల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. కూటమితోనే వడ్డెర్లకు ఆర్థిక, సామాజిక గుర్తింపు అని అన్నారు.
ఏపీ వ్యాప్తంగా ఆర్టీఎస్ఎస్ పనులు, పీఎం సూర్యఘర్ కనెక్షన్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు.
భారతీయ సంస్కృతిలోనూ, ధర్మ పరిరక్షణలోనూ అత్యంత విశిష్ఠమైన పర్వదినం శ్రీరామ నవమి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస అగ్ని ప్రమాదాల గురించి మంత్రి నారాయణను ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలతో పాటు, అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది.
ఎల్పీజీ సిలెండర్లకు బదులుగా పైప్డ్ గ్యాస్ను వాడేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతరం సరఫరా అవుతుందన్నారు.
మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.