Home » Chittoor
వైసీపీ నేతలు తెగబడ్డారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందే ఛైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమలలో మాత్రం బుధవారం సాయంత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని అడవి బూదుగురు ప్రాథమిక పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల వంటగదిలో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందిస్తూ వచ్చిన ఎనిమిది పసుపురైళ్ల స్థానంలో సరికొత్త ‘ఎర్రరైళ్లు’ ఈ నెల్లోనే పట్టాలెక్కనున్నాయి.
వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని ఇన్చార్జి మంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో సోమవారం మధ్యాహ్నం జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో పది ప్రాధాన్యతాంశాలపై చర్చించారు.
సీఎం చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చిన పీపీపీ విధానం ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోందని జిల్లా ఇన్చార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు అడవికి సమీపంలోని సాయిబులపల్లె పొలాల్లో వేటగాళ్లు వేసిన కరెంట్ ఉచ్చులో చిక్కి రెండు ఏనుగులు మృతి చెందాయి.
తిరుమల ఆలయంలో కేక్ కటింగ్ వివాదంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి వివరణ ఇచ్చారు. తాము కట్ చేసింది ఎగ్ లెస్ కేక్ అని స్పష్టం చేశారు.
చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మిందపాలెంలో దారుణం జరిగింది. ఇద్దరి వ్యక్తులు మధ్య నగదు విషయంలో వివాదం తలెత్తింది.