Home » China
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వేలకొద్దీ అకౌంట్స్ను ఇప్పటికే క్లోజ్ చేసింది. మరికొన్నింటిపై సమీక్ష ప్రారంభించింది.
చైనా తాజాగా మరో యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. తన జే-35 ఫైటర్ జెట్కు మార్పులు చేసి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జే-35ఏఈని తాజాగా ఆవిష్కరించింది. తొలి విమానాన్ని పాక్కు ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి
చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. హునాన్లోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 21 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 61 మందికి గాయాలయ్యాయి.
భారత్, చైనాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను రీ-పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్నకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, చైనాలు నరకాలు కావని, మానవాళికి మహోన్నత దేశాలని పేర్కొంది.
చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని భారత్ నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు నిలిచిపోయాయి.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్కు చైనా సాయపడుతోందని ఆది నుంచీ పలు మీడియా కథనాల ద్వారా వెల్లడవుతూనే ఉంది. అయితే.. ఈ కథనాలను నిజంచేసేలా యూఎస్ రిపబ్లికన్ పార్టీ సభ్యులొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకెళితే...
చైనాలో టెక్నాలజీ మరో కొత్త దశలోకి ప్రవేశించింది. అక్కడి హాంగ్జౌ నగరంలోని ఒక రెస్టారెంట్లో పని చేసే రోబో వెయిటర్లు మీరేం తినాలో చెబుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో పని చేసే ఆ రోబో వెయిటర్లు కస్టమర్ల మొహం, నాలుకను స్కాన్ చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో సూచిస్తాయి.
చైనా నుంచి తీసుకున్న శాటిలైట్తో ఇరాన్ యూఎస్ స్థావరాలపై నిఘా పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్కు తాము ఆయుధాలు పంపడం లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వెల్లడించారు. ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న వార్తలు కొద్ది రోజులుగా వెలువడుతున్న సంగతి తెలిసిందే.
అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ చైనా నౌక ఒకటి హోర్ముజ్ను దాటినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.