Hyderabad: చైనా మాంజా అమ్మినా.. వాడినా కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 10:20 AM
చైనా మాంజా అమ్మినా.. వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని మలక్పేట ఏసీపీ సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాణాంతకంగా మారిన ఈ చైనా మాంజాను దుకాణదారులెవరూ విక్రయించవద్దన్నారు. అలాగే.. ఈ మాంజాతో గాలిపటాలు ఎగురవేసినా చర్యలేంటాయన్నారు.
- ఏసీపీ సుబ్బిరామిరెడ్డి
హైదరాబాద్: ప్రాణాంతకంగా మారిన నిషేధిత చైనా మాంజాను తయారు చేసినా, అమ్మకాలు చేసినా, ఎవరైనా వాడినట్లుగా గుర్తించినా ఆయా వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మలక్పేట డివిజన్ ఏసీపీ సుబ్బిరామిరెడ్డి(ACP Subbarami Reddy) హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైనా మాంజా(China Manza) వాడకాన్ని పూర్తిగా నియంత్రించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎవరైనా చైనా మాంజాను అమ్ముతున్నట్లుగా గాని, వాడుతున్నట్లుగా గాని గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏసీపీ సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్కు డార్లింగ్!
రానూపోనూ టికెట్లు బుక్ చేస్తే 10శాతం రాయితీ
Read Latest Telangana News and National News
