Home » Chief Minister
జమ్మూకశ్మీర్లో రిజిస్టర్ అయిన కారుతో ఢిల్లీకి వెళ్తే అది కూడా ప్రస్తుతం నేరంగా పరిగణిస్తున్నారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.
పేలుడులో గాయపడి లోక్నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రేఖాగుప్తా మంగళవారంనాడు పరామర్శించారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు.
బెళగావి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర మాట్లాడుతూ, తన తండ్రి రాజకీయ కెరీర్ చివరి దశలో ఉందన్నారు. ఈ పరిస్థితిలో బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు కావాలని, ఆయనకు సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారని చెప్పారు.
తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదమైనట్టు తెలియగానే వివరణ ఇచ్చానని యతీంద్ర చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీలోనే మాట్లాడతానని, మీడియా ముందు మాట్లాడనని అన్నారు.
గుజరాత్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ కేబినెట్లోని మంత్రులంతా ఇవాళ(గురువారం) రాజీనామా చేశారు. మరికాసేపట్లో గవర్నర్ను సీఎం భూపేంద్ర పటేల్ కలవనున్నారు.
తమిళనాడు మూడు ప్రధాన ప్రకృతి వైపరీత్యాలను చవిచూసిందని, ఏ సందర్భంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రావడం కానీ, నిధులు ఇవ్వడం కానీ చేయలేదని స్టాలిన్ విమర్శించారు. ఇప్పుడు మాత్రం కరూర్కు ఆఘమేఘాల మీద వచ్చారని మండిపడ్డారు.
కేజ్రీవాల్ పోస్ట్ను బీజేపీ వెంటనే తప్పుపట్టింది. ఎడిట్ చేసిన వీడియోతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమంటూ మండిపడింది. రేఖా గుప్తా ఇంటర్వ్యూ పూర్తి వీడియోను కూడా విడుదల చేసింది.
జన్ జెడ్ను రెచ్చగొట్టి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని రాహుల్ కోరుతున్నారని, ఇది ఓటు చోరీ కాదని, ఆయన మెదడును ఎవరో చోరీ చేశారని దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
బాలకృష్ణుడు చిన్నతనంలో వెన్నంటే ఎంతో ఇష్టపడే వాడని, అందుకే ఆయనను అంతా వెన్నదొంగగా ముద్దుగా పిలుచుకునే వారని చెప్పారు. కృష్ణుడు మఖాన్చోర్ అయితే మోదీ 'మన్ కీ చోర్' అని పోలిక తెచ్చారు.
ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసి ముఖ్యమంత్రి ట్రాలీని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.