Home » Chief Minister
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసం, హింస, పోలీసులపై దాడులకు పాల్పడేవారికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
మహిళల భద్రత కోసం 'సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్'ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ముఖ్యమంత్రి విజయ్ మంగళవారంనాడు ప్రారంభించారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్ తొలి ప్రకటన చేశారు. విద్యార్థులకు శుభవార్త చెప్పారు. పాఠశాలలు, కాలేజీల నుంచి పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థుల వరకూ అందరికీ ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తొలి క్యాబినెట్ సమావేశానంతరం ప్రకటించారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ రూ.1,413 కోట్ల విలువైన ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్భవన్లో బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్తో గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జూన్ 3న ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ చర్చ మొదలైంది. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం చిక్కుల్లో పడిందని, అంతర్గత కలహాలను పార్టీ ఎదుర్కొంటోందని, ఆ కారణంతోనే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
కీలకమైన మంత్రివర్గ విస్తరణను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేపట్టనుంది. కొత్తగా 35 మందిని మంత్రివర్గంలో తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదివారంనాడు ప్రకటించారు.
పశ్చిమబెంగాల్లోని ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమవలసదారులపై చర్యలను సువేందు అధికారి ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే పారిపోండి అంటూ ముఖ్యమంత్రి తాజాగా వారిని హెచ్చరించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మంగళవారంనాడు పలు సంక్షేమ, నియంత్రణ చర్యలను ప్రకటించారు. విద్యాసంస్థలు, ఆలయాలకు ఒక కిలోమీటర్ దూరంలోపు మద్యం దుకాణాలపై నిషేధం విధించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్టు సోమవారంనాడు ప్రకటించారు.