Home » Chief Minister
కేరళం ముఖ్యమంత్రిగా సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన వీడి సతీశన్ తొలి క్యాబినెట్ సమావేశంలోనే కీలక సంక్షేమ, పాలనా సంబంధిత నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 15వ తేదీ నుంచి మహిళలకు కేఎస్ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి హెచ్చరిక చేశారు. ఆయనను 'పేరుమోసిన క్రిమినల్'గా అభివరిస్తూ, ఖాన్కు చెందిన కేసులను తాను వ్యక్తిగతంగా హ్యాండిల్ చేస్తానని అన్నారు.
పశ్చిమబెంగాల్ను పాలకుల ఇష్టానుసారం పాలించే వారని, ఇప్పుడు ఆ స్థానే చట్టబద్ధ పాలనను రాష్ట్రంలో తీసుసు వచ్చామని ముఖ్యమంత్రి సువేందు అధికారి అన్నారు.
కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం కొలువు తీరేందుకు సిద్ధమవుతోంది. మంత్రివర్గం ఏర్పాటుపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఈనెల 17వ తేదీ ఆదివారంనాడు మంత్రుల జాబితాను గవర్నర్కు అందజేస్తామని ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నట్టు వీడీ సతీశన్ తెలిపారు. 18న తనతో పాటు మంత్రులంతా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఆరంభంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధికార బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే మద్యం దుకాణాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది.
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11.40 గంటలకు గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
సాధారణ స్థాయి నుంచి వచ్చానంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమం నుంచి నిరాడంబరతను చాటుకుంటున్న విజయ్ వరుస ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. చెన్నైలోని ఎండీఎంకే చీఫ్ వైకోను మంగళవారంనాడు ఆయన నివాసానికి వెళ్లి విజయ్ కలుసుకున్నారు.
కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్కు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీలో ఎలాంటి నిరసనలు, రాజకీయ అశాంతికి తావీయరాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
తిరుచురాపల్లి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం సీటుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదివారంనాడు రాజీనామా చేశారు. మంత్రులు కేఏ సెంగోట్టియన్, పి.వెంకటరమణన్లు లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీని కలిసి విజయ్ రాజీనామా లేఖను అందజేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్ తొలి ప్రసంగంలోనే గత డీఎంకే ప్రభుత్వంపై విసుర్లు విసిరారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు రుణం మిగిల్చిందని, 2021-2026కు సంబంధించి తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.