Home » Chief Minister
కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.
మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం చేపట్టిన సన్నాహకాల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభా పక్ష నేతగా యుమునాం ఖేమ్చంద్ సింగ్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మణిపూర్ ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఆ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకునిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను నియమించింది.
విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుపై గవర్నర్ను బీజేపీ కలవాలని అనుకుంటున్నట్టు వస్తున్న సమాచారంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఈ బిల్లును గవర్నర్ తోసిపుచ్చలేదని చెప్పారు.
డిసెంబర్ ఎన్నికల్లో కొన్ని మున్సిపల్ కౌన్సిల్స్లో ఏ పార్టీకి మెజారిటీ రాని 'హంగ్' పరిస్థితి తలెత్తింది. దీంతో అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్ పదవి కోసం బీజేపీ నేతలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు.
మహారాష్ట్రలో ఉత్తరాది వారి గురించి ఫడ్నవిస్ మాట్లాడుతూ, వాళ్లేమీ పాకిస్థాన్ వాళ్లు కాదని చెప్పారు. ఉత్తరాది వారిని బయట వ్యక్తులుగా చిత్రీకరించడం, వాళ్ల పట్ల వివక్ష చూపించే ఎలాంటి చర్యలనైనా తాను వ్యతిరేకిస్తామని అన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన పరమేశ్వర గత నెలలో తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలని కర్ణాటక కాంగ్రెస్లో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అంశంపై తమ వాదనను ఉధృతం చేస్తూ న్యూఢిల్లీలో ఆదివారంనాడు మెగా ర్యాలీ నిర్వహించింది. ఓటింగ్ ప్రక్రియను తారుమారు చేసేందుకు బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ, ఈసీ ఖండించాయి.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2023లో ఇండియా కూటమి కోసం నితీశ్ చేసిన ప్రయత్నాలను ఒమర్ ప్రస్తావించారు. నితీశ్ను ఇండియా కూటమి కన్వీనర్గా చేసే విషయమై తాము అప్పట్లో జరిగిన సమావేశంలో చర్చించామన్నారు.
జమ్మూకశ్మీర్లో రిజిస్టర్ అయిన కారుతో ఢిల్లీకి వెళ్తే అది కూడా ప్రస్తుతం నేరంగా పరిగణిస్తున్నారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.