Home » Chennai News
ఇప్పటికే అధికమైన ఎండవేడితో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజానీకానికి మరో హాట్ న్యూస్. శనివారం అగ్నినక్షత్రం ప్రారంభం కానుంది. శనివారం నుండి మూడు రోజులపాటు పగటిపూట ఉష్ణోగ్రత(Temperature)లు అత్యధికంగా ఉంటాయని ప్రకటించిన వాతావరణ కేంద్రం.. 17 జిల్లాలకు ‘ఆరంజ్ అలెర్ట్’ జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచే రాష్ట్రంలో ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి.
మహిళలకు మరో తీపి కబురు చెప్పేందుకు డీఎంకే ప్రభుత్వం(DMK Govt) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయ కల్పించిన స్టాలిన్ ప్రభుత్వం.. మున్ముందు ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ఎలా వుంటుందన్నదానిపై ఆలోచిస్తోంది.
ఆమె ఫేస్బుక్(Facebook) ద్వారా బడాబడా పారిశ్రామికవేత్తలతో పరిచయం పెంచుకుంటుంది.. అది కాస్తా స్నేహంగా మలచి తన ఇంటికి ‘ఆతిథ్యానికి’ ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వారిని బందించి నగలు, నగదు లాగేసుకుంటుంది.
వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నరసాపురం- బెంగళూరు (వయా. కాట్పాడి, జోలార్పేట) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
సికింద్రాబాద్-రామనాధపురం(Secunderabad-Ramanadhapuram) రైలు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07695 సికింద్రాబాద్-రామనాథపురం ప్రత్యేక రైలు ఈ నెల 1,8,15,22,29, జూన్ 5,12,19,26 తేదీల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది.
చెన్నై-తిరుపతి(Chennai-Tirupati) మధ్య వందే మెట్రో రైళ్లు నడిపేందుకు రెండు నెలలు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
గ్రేటర్ చెన్నై(Greater Chennai)లో వచ్చే ఏడాది మార్చి నుంచి ఎగిరే విద్యుత్ టాక్సీ సేవలు ప్రారంభయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా నగరం నుంచి 14 నిమిషాల వ్యవధిలో శివారు ప్రాంతమైన తాంబరం చేరుకోవచ్చు.
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రిని దారుణంగా హతమార్చాడో కుమారుడు. బాధ్యత మరచి, అల్లరిచిల్లరగా తిరుగుతున్న కుమారుడిని మందలించడంతో పాటు అతడు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో డెబ్భై యేళ్ల తండ్రిపై ముష్ఠిఘాతాలు కురిపిస్తూ, కాళ్లతో తన్నుతూ రాక్షసంగా వ్యవహరించాడా ప్రబుద్ధుడు.
కంచి పట్టు చీరల ధరలు పెరిగాయి. కాంచీపురం(Kanchipuram) చేనేత పట్టుచీరలు ప్రపంచప్రసిద్థిగాంచినవి. కేంద్ర ప్రభుత్వ భౌగోళిక గుర్తింపు పొందిన పారంపర్య పట్టుచీరల ఉత్పత్తి వివిధ కారణాలతో రోజురోజుకు దెబ్బతింటోంది.
దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల్లో సేలం(Salem) మూడవ స్థానంలో నిలిచింది. ఈ నెల 23న సేలంలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ సూచించారు.