Home » Chennai News
అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, సెక్యూలర్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని డీఎంకే ప్రధాన కార్యాలయం గురువారం ప్రకటించింది.
కాళ్ల పారాణి ఆరకముందే ఓ యువతి కన్నుమూసింది. స్థానిక ఆవడి సమీపంలో వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతిచెందడంపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవల తంజావూరు జిల్లా సింగిపట్టి పర్యటనకు వచ్చిన టీవీకే అధినేత విజయ్ కారు వెంట బైక్తో పరుగులుతీసి ప్రమాదానికి గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుండి సోమవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీల్లో రూ.151 కోట్ల విలువైన నగదు, నగలు, వస్తువులు పట్టుబడ్డాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అరివాలయంలో డీఎంకే ఆశావహుల వద్ద ఉత్సాహభరితంగా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రజలు ఢిల్లీ అధిపత్య కూటమిని అంగీకరించరని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పరిసరాల్లో కేరళ ఆనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముంది.
గత ఐదేళ్ల డీఎంకే పాలనలో మహిళలకు భద్రతలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాల్లో ముగ్గురు మాజీమంత్రులు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు.
సాధారణంగా ఓ గ్రామం ఏదేని ఒక పంచాయతీలో గానీ, లేదా ఒక శాసనసభ నియోజకవర్గంలోగానీ ఒక లోక్సభ నియోజకవర్గంలో గానీ వుంటుంది.