Home » Budget 2026
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026-27ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పించనున్నారామె. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కాంజీవరం పట్టుచీరలో కనిపించారు. ఆ చీర విశిష్టతలేమిటో తెలుసుకుందాం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విదేశీ టూర్ ప్యాకేజీల విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
కేంద్రం.. బడ్జెట్ 2026-27లో ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(టీసీఎస్)ను 2 శాతంగా నిర్ణయించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో భాగంగా క్రీడారంగానికి సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. క్రీడా సరఫరా వస్తువులను అధిక నాణ్యతతో.. సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.
ఆదాయపు పన్ను శ్లాబ్లు యథాతథంగానే ఉంటాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్యాక్స్ల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని తెలిపారు. అలాగే సామాన్యుల సైతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేలా మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన ఈ చారిత్రాత్మక ఆదివారం నాడు భారత స్టాక్ మార్కెట్లు భారీ అస్థిరతకు లోనయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి.
1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త 'ఆదాయపు పన్ను చట్టం-2025'ను తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్లో దీనికి సంబంధించిన కీలక మార్పులను ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్డెట్లో వివిధ రంగాలకు పెద్దపీట వేశారు.
స్వయం ఉపాధి వ్యాపారవేత్తలైన(సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్స్) మహిళలకు కమ్యూనిటీ ఆధారిత రిటైల్ అవుట్లెట్ల ద్వారా ప్రోత్సాహం అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం వాక్చాతుర్యాన్ని కాకుండా సంస్కరణలను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ బడ్జెట్ను 'యువశక్తి ఆధారితం' అని నిర్మల అభివర్ణించారు.