Home » BRS
పార్టీ మారలేదని చెబుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్కు నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేశారు.
బీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి కారణాలపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ బీఆర్ఎస్వీ విద్యార్థులు, వడ్డెర సంఘాల నేతలు తెలంగాణ అసెంబ్లీ దగ్గర మంగళవారం ధర్నా చేపట్టారు. వివిధ సంఘాల ముట్టడితో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
పశ్చిమాసిమా యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు..
మాజీ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డిని సీఎం చేసింది తానేనని, సినిమాల్లో సీఎం పాత్ర చేయాలని ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మట్టి తరలింపు విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు బాహాబాహీకి దారితీసింది.
బడ్జెట్ కేటాయింపులపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ బడ్జెట్లో కూడా ఆరు గ్యారెంటీలకు ఘోరీ కట్టారని, డిక్లరేషన్లకు పాతర వేశారని, సంక్షేమ పథకాలకు సమాధి కట్టారంటూ మండిపడింది.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ను కలుస్తామని తెలిపారు.