Home » BRS
ఓ అక్కగా చెబుతున్నా. మహిళల గురించి ప్రస్తావించాలనుకుంటే బాధ్యతగా, సంస్కారవంతంగా మాట్లాడాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి సీఎం రేవంత్రెడ్డికి సూచించారు.
నలభై ఏళ్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గాన్ని మామ అల్లుడు పాపాల భైరవుల్లాగా పట్టి పీడిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
తెలంగాణకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) శనిలా పట్టారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు(Harish Rao) ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డికి మద్దతుగా గుమ్మడిదల మండల కేంద్రంలో రోడ్ షోలో నిర్వహించారు. ఈ రోడ్ షోలో హరీష్రావు, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజపీ, ఆర్ఎస్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు చెప్పే సంప్రదాయం ఉందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2012నుంచి జనాభా లెక్కలు ఎందుకు ఆపేసిందని ప్రశ్నించారు.జనాభాతో పాటు కులగణన జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని అన్నారు.
ఎండలు మండిపోతుండడంతోపాటు మరోవైపు గ్రేటర్లో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ సమీపిస్తుండడంతో అభ్యర్థులు తీవ్రంగా చెమటోస్తున్నారు. మండే ఎండను లెక్క చేయకుండా గెలుపునకు శ్రమిస్తున్నారు..
Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఏకిపారేస్తున్నారు. గురువారం కుక్నూర్ పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఉద్యమాల గడ్డ.. పోరాటాల ఖిల్లా. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన నేల. పీవీ నర్సింహారావు వంటి రాజకీయ ఉద్ధండుణ్ని పార్లమెంటుకు పంపించిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వరంగల్ లోక్సభ నియోజకవర్గం.. ఇప్పుడు ముక్కోణపు పోటీకి
సోషల్ మీడియాలో నకిలీ నోటీసులు ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
నేను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధం విధించిన భారత ఎన్నికల సంఘం, నా పేగులు మెడలో వేసుకుంటా.. కనుగుండ్లు పీకుతానన్న రేవంత్ రెడ్డిపై ఎందుకు నిషేధం విధించలేదు?’
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది.