Home » BRS
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తోందని, వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీం కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి టెండర్లలో సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య వాటాల పంచాయితీ నడుస్తోందని.. అందుకే ఐఏఎస్, జర్నలిస్టులను బలి పశువులను చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రివా..? ముఠా నాయకుడివా..? అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు..
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను వదులుకుని తప్పు చేశానని అన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్లో చేరానని తెలిపారు..
కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాం రా బాబూ.. అని అనుకుంటున్నారంట పలువురు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన పలువురు నేతలు. కాంగ్రెస్ అధఇకారంలోకి వచ్చిన కొత్తలో పలువురు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే.. ఇప్పుడు వారి పరిస్థితి అర్ధంగాని స్థితిలో పడిపోయిందని తెలుసస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. రెండు వారాల తర్వాత తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది.