Home » BRS
ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.
భారత రాష్ట్ర సమితి పార్టీ కేడర్ దిక్కుతోచని స్థితిలోపడిపోయి ఇళ్లకే పరిమితమైపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందువరకు ఫుల్ జోష్లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు.. ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోలేని స్థితిలో ఉండిపోతున్నారు. అలాగే పార్టీ అగ్రనేతలు కూడా నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు,
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ స్యూస్లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు కవిత.
గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే పై చేయిగా ఉంది. తొలివిడతలో జరిగిన రంగారెడ్డి జిల్లాలో పంచాయతీల్లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీంతో రెవెన్యూ అధికారులు అధికారికంగా భూ సర్వే చేపట్టడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
తెలంగాణ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ రెండేళ్లలో అసెంబ్లీ నిర్వాహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలన్నీ నేడు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేయడవలో దిట్టగా మారిందన్నారు.
విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై అఖిలపక్షం సమావేశం పెట్టాలని సూచించారు. కమీషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు.