Home » BRS Chief KCR
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఫాం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40 లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పేటెంట్ హక్కు రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉద్ఘాటించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ హక్కు కమ్యూనిస్ట్ పార్టీదే అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలో తమని గెలిపించి రాజకీయ మార్పు చూడాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు తిప్పికొట్టాలని రాంచందర్ రావు సూచించారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జీవితాంతం బీసీల పేర్లతో ఓట్లు అడిగిన వారు ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు తాము 'బాకీ కార్డులను' తీసుకెళ్తున్నామని తెలిపారు.
ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని సీఎం రేవంత్రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మెట్రోను రద్దు చేసి.. రేవంత్రెడ్డి ఫోర్త్ సిటీకి మెట్రో అంటున్నారని విమర్శించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు హెచ్చరించారు. రేవంత్, మల్లు భట్టి విక్రమార్క బాండు పేపర్పై సంతకాలు పెట్టి ఎన్నికల హామీలిచ్చారని.. కానీ ఎన్నికల హామీలపై ఇప్పడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధే తనను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపిస్తుందని మాగంటి సునీత ధీమా వ్యక్తం చేశారు. తాను ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తోందని ఎప్పుడూ అనుకోలేదని మాగంటి సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలంతా పండుగను ఘనంగా చేసుకోవాలని రేవంత్రెడ్డి, కేసీఆర్ ఆకాంక్షించారు.
హైడ్రా ఎందుకు తెచ్చామో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్కి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.