Home » BRS Chief KCR
బీసీ రిజర్వేషన్ బిల్లుపై సుప్రీంకోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు.
కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాంచందర్ రావు జోస్యం చెప్పారు.
చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు. మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నల సొంతమని ఉద్ఘాటించారు.
కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్రప్రభుత్వమని మాజీమంత్రి హరీష్రావు గుర్తుచేశారు. కాళేశ్వరం పూర్తి రిపోర్ట్ బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్రెడ్డి హడావుడి చేస్తున్నారని హరీష్రావు విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు తనకు టచ్లోకి వచ్చిన మాట వాస్తవమని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. తన నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీఎల్ సంతోష్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని గువ్వాల బాలరాజు పేర్కొన్నారు.
శిబూసోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దు:ఖసంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రత్యేక బృందాన్ని తెలంగాణ ప్రభుత్వం నియమించనుందని సమాచారం. ఇదే అంశంపై తెలంగాణ అంసెబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై అధికారుల కమిటీ ఆదివారం అధ్యయనం చేసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు అధికారుల దృష్టికి వచ్చాయి. సమగ్ర వివరాలతో నివేదికను కేబినెట్ ముందు అధికారుల కమిటీ ఉంచనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్న వారు ఏం మాట్లాడుతున్నారో.. కవిత అదే మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
కాంట్రాక్టర్లను ధనికులను చేయడానికి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. జస్టిస్ పీసీ గోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు.