Home » Britain
కేరళలో సాంకేతిక లోపంతో నిలిచిపోయిన ఎఫ్-35ని రిపేర్ చేయడం కష్టమని రాయల్ నేవీ భావిస్తున్నట్టు సమాచారం. విమానాన్ని భాగాలుగా విడగొట్టి స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన పరిహారం పెంపు కోసం యూకేలోని బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాతో పాటు బోయింగ్పై కూడా కేసు వేసేందుకు నిర్ణయించుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
తిరువనంతపురం ఎయిర్పోర్టులోని బ్రిటన్ యుద్ధ విమానాన్ని హ్యాంగర్కు తరలించాలన్న ఎయిర్ ఇండియా ఆఫర్ను యూకే నేవీ తిరస్కరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విమానాన్ని ఎయిర్పోర్టులో ఆరు బయటే నిలిపి ఉంచారు.
తుర్కియేలో ఇటీవల బ్రిటన్ మహిళ మృతి ఉదంతం మిస్టరీగా మారింది. ఆమె మృతదేహంలో గుండె లేనట్టు వైద్యులు చెప్పడంతో భర్త షాకైపోయాడు. తుర్కియేలోనే తమకు తెలీకుండా ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశాడు.
భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడానికి మూడేళ్ల పట్టింది. మోదీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 2022 నాటికి దీనిపై ఒక ముగింపునకు రావాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అప్పట్నించి పలుమార్లు సంప్రదింపులు జరిగాయి.
యుద్ధం అంటేనే మనకు ముందుగా.. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు గుర్తుకొస్తాయి. కొన్నేళ్ళ పాటు జరిగిన ఈ యుద్ధాలు.. ఇప్పటికీ చరిత్ర పుటల్లో సజీవ సాక్షాలుగా నిలిచిపోయాయి. పెద్ద పెద్ద యుద్ధాల గురించి తెలిసిందే.. అయితే ప్రపంచంలోనే అతి చిన్న యుద్ధం గురించి మీకు తెలుసా. కేవలం 38 నిముషాల పాటు జరిగిన ఈ యుద్ధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రిటన్ టెన్నిస్ క్రీడాకారిణి హ్యారిట్ డార్ట్ ఫ్రాన్స్ క్రీడాకారిణి లిస్ బాసన్పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైంది. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందించడంతో, ఆమె బాసన్ను క్షమాపణలు చెప్పింది
ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో సోమవారం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక ప్రకటన చేయనున్నారు. ప్రపంచీకరణ ముగిసినట్టేనని ఆయన ప్రకటిస్తారని స్థానిక మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
ఈ ప్రపంచం చాలా చిన్నది అంటారు. కొన్ని సంఘటనలు చూస్తే.. మరీ ఇంత చిన్నదా అని అనిపింకమానదు. అలానే కొన్ని సంఘటలను ఆశ్చర్యంతో పాటు భయం కలిగిస్తాయి. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. బాయ్ఫ్రెండ్ కాస్త తనకు బ్రదర్ అవుతాడని తెలిసి.. ఆమె షాక్కు గురయ్యింది.
యూకేకు చెందిన దాదాపు 200 కంపెనీలు వారానికి నాలుగు పని దినాల విధానాన్ని ఎంచుకున్నాయి. దీంతో, ఆయా సంస్థల్లోని ఉద్యోగులు ఇకపై వారానికి నాలుగు రోజులే ఆఫీసుకు రావాల్సి ఉంటుంది.