Home » Bengaluru
కాంగ్రెస్ ఐదేళ్ల పాలన ద్వితీయార్ధంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలపై డీకే శివకుమార్ను అడిగినప్పుడు ఆయన సూటిగా సమాధానంగా ఇవ్వలేదు. కాలమే సమాధానం చెప్పాలని, తాను జవాబు చెప్పలేనని అన్నారు.
నగరంలో సూపర్ సిక్స్-సూపర్హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు.
బెంగళూరు జీకేవీకే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి కారు నడుపుతుండగా కారు సన్ రూఫ్ తెరిచి బాలుడు నిలబడ్డాడు. ఈ క్రమంలో కారు వెళ్తుండటంతో రోడ్డుపై ఉన్న ఇనుప కమ్మీ బాలుడు తలకు బలంగా తగిలింది.
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనుమడు, జేడీఎస్ సీనియర్ నేత హెచ్ రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్ రేవణ్ణపై పలు అత్యాచార, లైంగిక దాడుల కేసులు ఉన్నాయి. ఒక అత్యాచారం కేసులో ఆయనను ప్రత్యేక కోర్టు 2025 మేలో దోషిగా ప్రకటించింది.
ఆరు వేర్వేరు సందర్భాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వ కారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కెమెరాల్లో సీఎం ఫ్రంట్ సీటులో సీటుబెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నట్టు రికార్డయింది.
జైల్లో ఉన్నా అతడిలో మార్పు రాలేదు. రెండో బాధితురాలికి పెళ్లి పేరుతో దగ్గరయ్యాడు. ఆమెను కూడా ఇలాగే మోసం చేశాడు. మూడో బాధితురాలు అతడిపై రేప్ కేసు పెట్టింది. 6 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు.
పార్టీలకు అతీతంగా తనకు ఎందరో మిత్రులు, అనుచరులు ఉన్నారని, అందరి మనోభావాలను గౌరవిస్తానని డీకే శివకుమార్ తెలిపారు. తాను ఎవరికన్నా పెద్ద కాదని, కష్ట సమయంలో ఎవరున్నా వారికి అండగా నిలబడేందుకు తాను జీవితాంతం కట్టుబడి ఉంటానని చెప్పారు.
ఊబర్ ద్వారా రైడ్ బుక్ చేసుకోవాలనుకున్న అతడికి షాక్ తగిలింది. ఒక కిలోమీటర్ ప్రయాణం కోసం ఏకంగా 425 రూపాయలు చూపించింది. దీంతో కస్టమర్ రైడ్ బుక్ చేసుకోవటమే మానేశాడు.
Childhood Friend: విజయ్ భార్యను తీసుకుని మాచోహళ్లి వెళ్లిపోయాడు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే, ధనుంజయ్, ఆశల సంబంధం మాత్రం ఆగలేదు. ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. తమ సంబంధానికి విజయ్ అడ్డుగా ఉన్నాడని వారు భావించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) బెంగళూరులోని KSR రైల్వే స్టేషన్లో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో పాటు, ప్రయాణీకులకు సౌలభ్యం, వేగం, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తాయి.