Home » BC Declaration
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీసీ వాదంతో గెలిచిందనే విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోవద్దని బీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. రేపు(సోమవారం) 17వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఢిల్లీకి వెళ్లే అఖిల పక్షం తేదీని ప్రకటించాలని కోరారు బీసీ జేఏసీ నేతలు.
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేటు క్యాబ్ దందా జోరుగా సాగుతోంది. బస్సులు నడవకపోవడంతో ఎలాగూ క్యాబుల్లో ప్రయాణించాలి కాబట్టి చార్జీలు భారీగా పెంచారు. ప్రయాణికుల నుంచి అధికశాతం చార్జీలు వసూలు చేయడంతో లబోదిబోమంటున్నారు. ఉప్పల్ నుంచి హనుమకొండకు క్యాబ్ డ్రైవర్లు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.300 తీసుకుంటుండగా.. నేడు బంద్ ప్రభావం కారణంగా రూ.700 వసూలు చేస్తున్నారు.
బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని.. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందని కవిత ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ఉదయం 4 గంటల నుంచే బంద్ మొదలైంది. జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు అడ్డుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లు హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అలానే 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం కోర్టు మెట్లు ఎక్కింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపివేసింది.
ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని హైకోర్టుకు ఏజీ సుదర్శన్రెడ్డి వివరించారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పేర్కొన్నారు.
బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించింది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. అయితే..