Home » Ayyanna Patrudu
సభాపతిగా నేను ఈ కుర్చీలో కుర్చున్నా నాకు కూడా కొంత ఆవేదన కలుగుతుంది. ప్రెస్ మీట్, సోషల్ మీడియాలో రోజు చూస్తున్నాం వారు మాట్లాడే తీరు. మళ్లీ మేమే వస్తాం మీ అంతుచూస్తాం, పీకలు కోస్తాం... రప్ఫా రప్ఫా అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారని అయ్యన్నపాత్రుడు అన్నారు.
అసెంబ్లీ సమీపంలో చీఫ్ విప్, విప్ల కోసం కార్యాలయాలు సిద్ధమయ్యాయి. భవనం కింద అంతస్తులో మీడియా పాయింట్, డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని స్పీకర్ ప్రారంభించారు.
ఈ మేరకు మంత్రులు, అధికారులు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా స్పీకర్ ఆదేశించాలని ఎమ్మెల్యే బుచ్చయ్య పట్టుబట్టారు. దీనిపై వెంటనే స్పందించిన స్పీకర్, మంత్రులు వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు.
జగన్ పెట్టిన పథకాలలో అవినీతిపై ఒకరోజు చర్చ పెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రస్తుతం లబ్ధిదారులను బ్యాంక్లు ఇబ్బందిపెడుతున్నాయని, జగన్ చేసిన అప్పులకు లబ్ధిదారులు బలి అవుతున్నారన్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు శాసనసభ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి.
సమాజం గురించి మహిళను ఎడ్యుకేట్ చేస్తే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. సురక్షిత సమాజ నిర్మాణం ఏ రాష్ట్రానికైనా ముఖ్యమని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తున్నామని నొక్కిచెప్పారు. బుడమేరు గట్టులు మరమ్మతులు చేయకపోవడంతోనే వరదలు వచ్చాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు.
శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ల ఆధ్వర్యంలో 2025 నుంచి 2026కు ఉభయ సభల సభ్యులతో సంయుక్త కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇవాళ(శనివారం) ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు.