Share News

AP Assembly Speaker : ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది : అయ్యన్న పాత్రుడు

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:08 PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

AP Assembly Speaker : ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది : అయ్యన్న పాత్రుడు
AP Assembly Speaker on YS Jagan

అమరావతి, ఆగష్టు 14 : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి, ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయంకు జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ పార్టీ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా అంటూ నిలదీశారు.


'గత ఐదేళ్లలో అసెంబ్లీలోని ప్రింటర్లు తుప్పు పట్టినట్టే సభ కూడా తుప్పు పట్టింది. గత ప్రభుత్వంలో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడా తుప్పుపట్టాయి. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 75 రోజులు పని దినాలు మాత్రమే నడిచాయి. భారతదేశంలో ప్రతి అసెంబ్లీ తక్కువలో తక్కువ 60 రోజులు జరగాలి అని పాట్నాలో తీర్మానించాం. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే 31 రోజులు సమావేశాలు జరిగాయి. 17, 18 నుండి అసెంబ్లీ సమావేశాల ఉండవచ్చు. భారతదేశంలో ఏ పౌరుడు అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే బావుంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది అని మాజీ CM ఎలా అంటారు.' అని అయ్యన్న పాత్రుడు విమర్శించారు.


పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై స్పందించిన మంత్రి.. 'ఆ రోజు అక్కడ(పులివెందుల) ఒక్క నామినేషన్ వెయ్యలేదు. టీవీలో చూశాను.. ముఖ్యమంత్రిని అలా మాట్లాడడం ఏంటి? నీకు మెంటల్ వచ్చిందా.. ఇది పద్దతి కాదు. అసలు నీ పార్టీ ఎజెండా ఏంటి.. నీ ఆలోచన ఏంటి.. గొప్ప నాయకులే ఓడిపోతారు, గెలుస్తారు. ఇందిరాగాంధీ, ఎన్‌టి‌ఆర్ లాంటి నేతలే ఓడిపోయారు. పులివెందులలో ఎప్పుడైనా ఇన్ని నామినేషన్‌లు వేసారా? ఇప్పుడు 11 నామినేషన్‌లు పడ్డాయి. ప్రతి రోజు అసెంబ్లీలో మీ సభ్యులు కోసం రెండు ప్రశ్నలు వస్తాయి. 10 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు మీ సభ్యులకు సంఖ్యాపరంగా కేటాఇస్తాం. వైసీపీ ఎమ్మెల్యేలు క్వశ్చన్‌లు వేస్తున్నారు.. ఐతే ప్రశ్నించడానికి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. రెండు ప్రశ్నలు వేస్ట్ అవుతున్నాయి. మీరు రాకపోతే చెప్పండి.. ఆ ప్రశ్నలు మరో పార్టీకి అలాట్ చేయాలి. కాబట్టి ఆ సభ్యులు అందరూ రావాలి అని కోరుతున్న. మీరు వస్తారా... రారా, నాకు క్లారిటీ ఇవ్వండి. వీటిపై నేను నిర్ణయం తీసుకోవాలి. మీ వల్ల ప్రశ్నలు మురిగి పోతున్నాయి. అసెంబ్లీలో చాలా కీలకం ప్రింటింగ్ ప్రెస్. నేను స్పీకర్‌గా వచ్చే సరికి ప్రింటింగ్ ప్రెస్ తుప్పు పట్టి ఉన్నాయి. ప్రభుత్వం ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడి కొత్త మెషిన్‌లు తెచ్చాం. నూతనంగా ఉన్న టెక్నాలజీ మెషీన్ తీసుకున్నాం. నిముషాల్లో కొన్ని వేల పేపర్‌లు ప్రింట్ చేసే మెషీన్ ఇది. ఆటోమేటిక్‌గా మెషీన్ పనిచేస్తుంది. తక్కువ స్థలం లో మెషిన్ పెట్టుకోవచ్చు. దీనితో పాటు కర్నూలులో ఒకటి, విజయవాడలో ఒక్కటి ప్రభుత్వ ముద్రణ చేసే ప్రెస్‌లు ఉన్నాయి. అవి కూడా తప్పుపట్టు పట్టి ఉన్నాయి. వాటిని కూడా రెనోవేట్ చేస్తాం' అని అయ్యన్న చెప్పారు.

Updated Date - Aug 14 , 2025 | 01:16 PM