Home » Assembly elections
బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - సర్) పేరుతో ఓట్ల చోరీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.
ఆంధ్రాలో భారీ జన సమీకరణ చేసి పార్టీ ప్రారంభించిన నటుడు చిరంజీవి, ఆ పార్టీని రద్దు చేశారు, కానీ, ఈపీఎస్ ఎవరో కూడా తెలియదు అన్న నటుడు విజయ్ రాజకీయాల్లో ఏమి సాధిస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఎద్దేవా చేశారు.
డీఎంకేను అధికారం నుండి ఇంటికి సాగనంపేందుకే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు మాజీసీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంలో గత నెల 7వ తేదీన కోవై మేట్టుపాళయంలో ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర మంగళవారం తిరుచ్చి జిల్లా శ్రీరంగం చేరుకుంది.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల నిర్వహణ దిశగా జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంస్థ.. ఓటర్ జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్నూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మొదల పెట్టనుంది.
కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించేదిశగా ఎన్నో కమిటీలు ఏర్పాటైనా కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించివేయడమే పనిగా పెట్టుకుందని, జీఎస్టీ ద్వారా ఎక్కువగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకు సరిపడా నిధులను విడుదల చేయకుండా ముప్పుతిప్పలు పెట్టడం భావ్యమేనా అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు.
మదురై మహానాడులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలను విమర్శించడాన్ని ఖండిస్తూ ఆ పార్టీల నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర పురపాలక, పరిపాలనా శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ మాట్లాడుతూ... నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా రాష్ట్రప్రజలకు సేవలందిస్తున్న స్టాలిన్ను విజయ్ విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, దానిని నెరవేర్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం బూత్ లెవల్ కమిటీ సభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్ డీఎంకేని చిత్తుగా ఓడించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ శపథం చేశారు. మదురై సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ ద్వితీయ మహానాడులో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. తమ పార్టీకి సైద్ధాంతికి శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అని ప్రకటించారు.
రాజకీయాల్లో అంతగా అనుభవంలేని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉన్నపళంగా అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని, ప్రజల అండదండలు లేకుండా ఇది ఎప్పటికీ నెరవేరదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.
వచ్చే యేడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగా అన్నాడీఎంకే జాతీయపార్టీ బీజేపీతో అత్యవసరం పొత్తును ఖరారు చేసుకోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.