Home » Artificial Intelligence
ఏఐ అక్షరాస్యత లేని వారికి లేఆఫ్స్ రిస్క్ ఎక్కువని గ్యాలప్ సంస్థ పేర్కొంది. టెక్ రంగంలో ఈ ముప్పు మరింత అధికమని వెల్లడించింది.
రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన డేటా సేకరణ కార్యక్రమాలతో వేల మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. దుస్తులు మడతపెట్టడం, కాఫీ తయారు చేయడం వంటి పనులను కెమెరాతో రికార్డు చేసి షేర్ చేసేందుకు గంటకు రూ.250ల చొప్పున సంపాదిస్తున్నారు.
భవిష్యత్తులో డబ్బుకు విలువ, మనిషికి పని ఉండవని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ అన్నారు. ఏఐ, రోబోల రాకతో కొరత అనేదే లేకుండా పోతుందని చెప్పారు.
మౌలిక అంశాలపై పట్టు సాధించే వరకూ విద్యార్థులు ఏఐ వినియోగించకపోవడమే మంచిదని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. ఏఐ వినియోగించే విద్యార్థుల మేధో సామర్థ్యాలు తగ్గుతాయని హెచ్చరించారు.
ఏఐ సాంకేతికతతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తగ్గుతున్నాయన్న వాదనను ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తోసిపుచ్చారు.
ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా 65 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ విలువ 965 బిలియన్ డాలర్లుగా తేలింది.
భారత్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు సమీప భవిష్యత్తులో పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు సౌరభ్ ముఖర్జీయా అన్నారు. మనుషులు చేసే పనులను ఆటోమేట్ చేయడానికి కంపెనీలు పోటీ పడుతున్నందున కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఏఐతో రాబోయే ముప్పుపై పోప్ లియో పలు హెచ్చరికలు చేశారు. మానవాళి మేలు కోసం కాకుండా ధనార్జనే లక్ష్యంగా ఏఐ విషయంలో ముందుకెళ్లడం పాపమని స్పష్టం చేశారు.
మెటాలో మరోసారి లేఆఫ్స్ కలకలం రేగింది. ఈసారి దాదాపు 8 వేల మంది లేఆఫ్స్కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
బాల్కనీలో పావురాల బెడదకు ఏఐతో ఒక వ్యక్తి చెక్ పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. జనాలు అబ్బురపడేలా చేస్తోంది.