Home » AP Politics
పల్నాడులో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
మచిలీపట్నం పోలీసు స్టేషన్లో 40 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టుతో సహా సుమారు 40 మందిపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు.
PM SHRI పథకం క్రింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఆ పథకం ద్వారా 3550 KW ఉత్పత్తి లక్ష్యంతో 415 పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లకు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
జగన్కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టారని విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్య వాది అయితే అసెంబ్లీకి రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
తిరుమల రాజకీయ నిరుద్యోగి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల పవిత్రత దెబ్బతిన్నేలా ప్రతిరోజు అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై అసత్యప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.