Home » AP Police
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్లో వైసీపీ నేతలపై పలు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం పెనుమాక సందర్శనకు వచ్చిన వైసీపీ నేతల బృందాన్ని ఉండవల్లి వద్ద రాజధాని రైతులు అడ్డుకున్నారు.
మచిలీపట్నంలో త్రినాథ్ రావు అనే వ్యక్తి రజనీకుమారికి కోటి రూపాయలను బంగారం కోసం ఇచ్చారు. ఈ నగదు ఇవ్వాలని ఆమెను అడగడంతో తన భర్త గూడవల్లి రాజశేఖర్, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి కత్తితో దాడి చేయించారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి సహా 17 మంది ఎమ్మెల్సీలు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని మద్దిలపేట గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని సౌరదిన్నె గ్రామంలో ఫకీరు వేషంలో వచ్చిన ఓ దుండగుడు మహిళను మోసం చేసి రూ.50 వేల నగదును అపహరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సింహాచలంలో జరిగిన రాధాగాయత్రి అంత్యక్రియలకు.. ఆమె భర్త శ్రీచరణ్ తల్లిదండ్రులతో పాటు బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడి పలు కీలక విషయాలను వివరించారు.
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం పరిధిలోని దండిపూడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర భయాందోళనలని రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ పులి, తాజాగా తన మకాంను దండిపూడి అడవులకు మార్చినట్లు అధికారులు గుర్తించారు.
గాదె సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. స్వయంగా ఐజీ రంగంలోకి దిగి నేరుగా ప్రశ్నించినప్పటికీ, సీఐ నాగరాజు నోరు మెదపకపోవడం, సమాధానాలు చెప్పకుండా దాటవేయడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.