Home » AP Police
Andhrapradesh: బెజవాడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. విజయవాడ గురునానక్ నగర్లో ఓ కుటుంబలోని ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారు ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు. భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు (Chittoor) జిల్లాలో మరోసారి అరాచకాలు, అలజడులు సృష్టించడానికి వైసీపీ ప్లాన్ చేసింది. జిల్లాలో మరోసారి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. అధికార పార్టీకి బలంగా ఉన్న ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డారు.
తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Aranii Srenevasulu)పై వైసీపీ (YSRCP) నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం నాడు గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.
ఏపీ ఎన్నికల (AP Election 2024) ముందు ఏపీ పోలీసుల (AP Police) కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్ననే అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే విషయంపై ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
Andhrapradesh: రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు.
ఏపీ పోలీసులపై కేంద్ర ఎన్నిల సంఘం వేటు వేసింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి సహకరించారని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తీసుకురావడంతో ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ రామాంజనేయులపై బదిలీ వేటు వేసింది.
టీడీపీ నేతలకు ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి నానా హంగామా చేస్తున్నారు. తొలుత అనుమతి ఇచ్చి.. తర్వాత వైసీపీ నేతల మాటలకు తలొగ్గి తమను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) గులకరాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్కుమార్ను పోలీసులు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు నగరంలోని జిల్లా జైల్లో ఉన్నాడు. రెండో నిందితుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావును శనివారం రాత్రే ఇంటికి పంపేశారు. వాస్తవానికి..
Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు మరో 20 రోజులే సమయం ఉంది. దీంతో పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీకి చెందిన నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేలా ప్లాన్స్ చేస్తున్నారు. మద్యం తరలింపులపై పోలీసులు ఎక్కడిక్కడ చెక్పోస్టులు...