Home » AP Police
మెుంథా తుపాన్ దృష్ట్యా అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
కర్నూలు వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారకుడైన బైకర్ శివశంకర్ బెల్ట్ షాపులో మద్యం తాగాడంటూ వైసీపీకి అనుకూలమైన బ్లూ మీడియాతో సహా కొన్ని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది వైసీపీ అనుకూల మీడియా. అయితే, ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై ప్రభుత్వం సీరియస్ అయింది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఓ ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వేమూరి కావేరి సంస్థకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సులో ప్రయాణిస్తున్న19 మంది ప్రయాణికులు మృతిచెందారు.
మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- బైక్ ఢీకొని 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకి కారణమైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై కర్నూలు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.
బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు.. కలెక్టరేట్లో: 08518-277305, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059, ఘటనాస్థలి వద్ద: 91211 01061.
విద్యార్థుల ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఎట్టకేలకు విద్యార్థులు సురక్షితంగా ఉండడంతో పోలీసులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
సంత్రగచ్చి - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కదులుతున్న రైల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(35)పై నిందితుడు జొన్నలగడ్డ రాజారావు అత్యాచారంచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్లో సంత్రగచి స్పెషల్ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. జగ్గయ్యపేట డిపోనకు చెందిన బస్సులో విజయవాడ వైపు వెళ్తున్న బస్సులో ఎక్కింది సదరు మహిళ.